Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజవి హీరోయిన్‌పై హత్యాయత్నం కేసు... ఆరా తీసిన మెగాస్టార్?

Webdunia
బుధవారం, 24 జులై 2019 (16:20 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలు మాస్టర్, ఇద్దరు మిత్రులు. ఈ రెండు చిత్రాల్లో సాక్షి శివానంద్ నటించింది. ఇందులో మాస్టర్ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించగా, ఇద్దరు మిత్రులు చిత్రంలో ఓ మంచి స్నేహితురాలిగా నటించింది. ఆ తర్వాత మోహన్ బాబు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వంటి దిగ్గజ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి హీరోయిన్ ప్రస్తుతం చిక్కుల్లో పడింది. 
 
సాక్షి శివానంద్ సోదరీ శిల్బా ఆనంద్... సచలన ఆరోపణలు చేసింది. తన అక్క సాక్షి శివానంద్ తనను హత్య చేసేందుకు ప్లాన్ వేసిందంటూ ఆరోపించింది. ఇందులో సాక్షి అత్త ప్రమేయం కూడా ఉందని పేర్కొంది. ముఖ్యంగా, తన బీమా డబ్బుల కోసమే తనపై ఈ హత్య ప్రయత్నం చేసినట్టు ప్రకటించి సంచలన సృష్టించింది. 
 
గతంలో తన తల్లిపై కూడా ఇలాగే తన అక్క... ఆమె అత్త హత్యాయత్నానికి ప్రయత్నించినట్టు తెలిపింది. ఈ విషయమై తాను ఫిర్యాదు చేసేలోపు వాళ్లు అమెరికాకు పారిపోయారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై పోలీసులు విచారణ జరిపి వాళ్లను తగిన విధంగా శిక్షించాలని కోరింది. కాగా, సాక్షి శివానంద్ వ్యవహారం చిరంజీవి దృష్టికి వెళ్లినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments