Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా హెగ్డేను లేకుండా చేశారు.. త్రివిక్రమ్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్లు

Webdunia
శనివారం, 1 జులై 2023 (13:17 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "బ్రో". సముద్రఖని దర్శకుడు కాగా, జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 28న బ్రో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ తాజాగా బ్రో టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్రో సినిమా టీజర్ విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. 
 
బ్రో సినిమాకు ఎలాంటి సంబంధం లేని స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై ట్రోల్స్ వస్తున్నాయి. ఇందుకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్రో చిత్రంకు త్రివిక్రమ్ మాటలు అందించిన సంగతి తెలిసిందే. 
 
అయితే బ్రో సినిమా టీజర్ ప్రారంభంలో ఓ కమర్షియల్ వస్తుండగా.. అందులో పూజా హెగ్డే వున్నారు. పూజా యాడ్ కోసమే టీజర్‌ను లేట్‌గా రిలీజ్ చేశారంటూ కొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. 
 
పూజా హెగ్డేను బ్రో టీజర్‌లో పెట్టడానికే మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి తీసేశావ్ అంటూ దర్శకుడు త్రివిక్రమ్‌పై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం : రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి

షాకింగ్ వీడియో : లోనావాలా జలపాతంలో కొట్టుకుపోయిన ఓ కుటుంబం (Horror Video)

పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చెయ్యడమంటే కొరివితొ తల గొక్కోవటమే : వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి (Video)

హైదరాబాదులో భారీ వర్షాలు... ట్రాఫిక్‌తో చిక్కులు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

ఆస్తి వివాదం.. హైదరాబాద్‌లో తల్లీ కుమార్తెను గదిలో బంధించి గోడ కట్టేశారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments