అల... వైకుంఠపురములో సామజవరగమన పాట నచ్చలేదు అని కాదు కానీ..?

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (13:31 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన భారీ చిత్రం అల.. వైకుంఠపురములో. బన్నీ, పూజా హేగ్డే జంటగా నటించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

ఈ సినిమాలోని పాటలన్నీ సక్సస్ సాధించడం... ఈ సినిమా సంక్రాంతికి వస్తుండడంతో సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ మూవీ గురించి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియచేసాడు.
 
ఇంతకీ త్రివిక్రమ్ ఏం చెప్పారంటే... అల .. వైకుంఠపురములో సినిమా టైటిల్ అనుకోగానే ఆడియన్స్ ఎలా ఫీలవుతారు. మనకు సంబంధం లేని టైటిల్ అనేస్తారా..? అని భయపడ్డాను. ఎందుకంటే పోతన గారి పద్యం భాగవతంలోని ఒక లైన్ కదా... అందుకని భయపడ్డాను. కానీ.. బన్నీచాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు. ఇది ఖచ్చితంగా  పెట్టేయాల్సిన టైటిల్ అని ఫిక్స్ అయిపోయాడు. ఆ రియాక్షన్ మాత్రం అసలు ఊహించలేదు.
 
టైటిల్ లో ఉన్న సీక్రట్ గురించి చెబుతూ... మనం ఎవరికైనా ఒక స్ధానాన్ని అయితే.. కల్పించగలం. అది మన చేతులో ఉండే పని. ఆ స్ధానాని తగ్గట్టుగా వాడు ప్రవరిస్తాడా..?  లేదా..? అనేది వాళ్లకు సంబంధించిన విషయం. అది చెప్పేదే అల.. వైకుంఠపురములో టైటిల్ అని చెప్పారు.

ఇక పాటల గురించి  చెబుతూ.. సామజవరగమన పాట చేసాం. అయితే...  ఆతర్వాత మాకే భయమేసి ఇంకో పాట చేసాం. బన్నీకి కూడా చెప్పలేదు. తమన్ తో కలిసి సేఫ్టీకి ఇంకో పాట చేసాం. అయితే... సామజవరగమన చాలా బాగుంది అని అందరూ బలంగా చెప్పడంతో ఆ పాటనే ఫైనల్ చేసాం. 
 
సామజవరగమన పాట నచ్చలేదు అని కాదు కానీ... ఒకసారి ఏంటంటే... మరి క్లాసికల్‌గా వెళ్లిపోతున్నామా..? ఏం పట్టించుకోవడం లేదా..? మరీ.. అంత తెగింపు మంచిదేనా..? అని ఆలోచనలోంచి సేఫ్టీ సాంగ్ చేసాం. సినిమా ఎలా ఉంటుంది అని చెప్పాలంటే.. ఫస్టాఫ్ ఇలా ఉంటుంది. సెకండాఫ్ ఇలా ఉంటుంది అని కాకుండా డిఫినెట్ గా ఇది ఎంటర్ టైనర్. ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా సినిమా బలంగా ఎంటర్ టైనర్ గా ఉంటుంది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం

నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. ఆపై హత్యకు గురయ్యాడు...

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం: 44 మంది మృతి.. వందలాది మంది గల్లంతు

రైతులకు నష్ట పరిహారం ఇస్తానని.. ఏదో గుడిలో లడ్డూ అంటూ డైవర్ట్ చేసేస్తాడు.. జగన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments