Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూకబ్జా ఆరోపణల కేసు.. రానా, సురేష్ బాబులకు సమన్లు జారీ

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (00:22 IST)
టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి తండ్రి, ప్రముఖ సినీ నిర్మాత డి. సురేష్ బాబు, భూకబ్జా ఆరోపణల కేసులో న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. తనకు చెందిన భూమిని ఖాళీ చేయాలని తండ్రీ కొడుకులు ఒత్తిడి చేస్తున్నారని స్థానిక వ్యాపారవేత్త ప్రమోద్ కుమార్ దాఖలు చేసిన కేసులో 'బాహుబలి' నటుడు రానాతో పాటు సురేష్ బాబు పేరు కూడా వుంది. 
 
ఈ నేపథ్యంలో నగరంలోని నాంపల్లిలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వారికి సమన్లు ​​జారీ చేసింది.
 
షేక్‌పేటలోని వివాదాస్పద భూమిని 2014లో సురేష్ బాబు తనకు లీజుకు ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లీజు ముగియడంతో, సురేశ్ బాబు తనకు ఆస్తిని రూ.18 కోట్లకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడని, డీల్ కుదిరిందని ఆరోపించారు.
 
ఈ డీల్‌కు సంబంధించి 5 కోట్ల రూపాయలు చెల్లించగా, సేల్ - రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తి చేయడానికి సురేష్ బాబు పట్టించుకోలేదని ప్రమోద్ కుమార్ పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కాకముందే సురేష్ బాబు ఆస్తిని తన కొడుకు రానా పేరు మీదకి బదలాయించాడని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments