Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ నటి కవిత ఇంట కరోనా కల్లోలం.. మొన్న కుమారుడు, నేడు భర్త

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (11:26 IST)
ప్రముఖ సీనియర్ నటి ఇంట్లో కరోనా కల్లోలం సృష్టించింది. కరోనాతో మొన్న కొడుకును, ఈరోజు భర్తను పోగొట్టుకుని తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది సీనియర్ నటి కవిత. జూన్ 15న కోవిడ్ -19 సమస్యల కారణంగా ఆమె తన కొడుకును కోల్పోయారు. ఆమె కుమారుడు సంజయ్ రూప్ కు కొన్నిరోజుల క్రితం కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 
 
దీంతో అతను ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాడు. అయితే అతని ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండడంతో ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ లోనే అతను తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఇక కవిత భర్త దశరథ రాజ్ కూడా కోవిడ్ -19 బారిన పడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా రోజులు కరోనాతో పోరాడిన ఆయన ఈ రోజు కన్నుమూసినట్టు సమాచారం.
 
ఇక పలు తెలుగు, తమిళ చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించిన కవిత ప్రస్తుతం “ఎండ్రెండ్రుం పున్నగై “అనే టీవీ షోలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. 11 ఏళ్ల వయసులో సినిమా పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టింది. ఆ తరువాత దాదాపు 350 చిత్రాల్లో నటించారు కవిత. ఇప్పుడు ఈ సీనియర్ నటి చాలా తక్కువ కాలం గ్యాప్ లో కొడుకుని, భర్తను కోల్పోవడం విషాదకరం. దశరథ్ మరణించారన్న వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

Pawan: సింపుల్ టీ-షర్ట్, షార్ట్స్‌లో పవన్.. సెలూన్‌ ప్రారంభం.. వైకాపా ట్రోల్స్

నోరు ఉండి కూడా చెప్పరు... కిషన్ రెడ్డిపై రాజా సింగ్ విమర్శలు

TDP: ఇకపై ఎవరు పడితే వారు టీడీపీలో చేరలేరు.. దానికంటూ...?

హనీమూన్‌లో భర్త హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ ... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments