Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసాని క్షమార్హులు కాదు... ఆయనది పగటి వేషం : నిర్మాత ఎస్కేఎన్

ఠాగూర్
శుక్రవారం, 22 నవంబరు 2024 (16:52 IST)
తాను రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‍బై చెబుతున్నట్టు నటుడు పోసాని కృష్ణమురళి చేసిన ప్రకటనపై సినీ నిర్మాత ఎస్కేఎన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాని ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమార్హులు కాదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటానన్న పోసాని... పగటి వేషం వేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబాల గురించి, పిల్లల గురించి నీచాతి నీచంగా మాట్లాడరని, అభిమానుల మనసులను సైతం గాయపరిచారని వ్యాఖ్యానించారు. 
 
గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా నోరుపారేసుకున్న పోసానిపై ఇపుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన రాజకీయాలను తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇకపై ఏ పార్టీని తిట్టనని, ఏ పార్టీని పొగడనని ఆయన అన్నారు. తన కుటుంబానికి తగిన సమయం ఇవ్వలేకపోతున్నానని... అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
 
మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులపై గతంలో పోసాని అనుచిత వ్యాఖ్యలు. ఈ కారణంగా ఆయనపై పలు చోట్ల పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఆయనను అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఇంతలోనే పోసాని నుంచి కీలక ప్రకటన వెలువడటం గమనార్హం.
 
దీనిపై సినీ నిర్మాత ఎస్కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటూ మీరు నటించే ముందు... తమ అభిమాన నాయకుడి గురించి, వారి ఇంట్లోని పసి పిల్లల గురించి మాట్లాడిన సంస్కార హీనమైన, నీచమైన మాటలకు చింతిస్తున్నానని లేదా క్షమించండని అడిగి ఉంటే... మీ మాటలను నమ్మాలనిపించేదని అన్నారు. మీరేదో పొరపాటున ఒకసారి మాట్లాడిన వ్యక్తి కాదని మండిపడ్డారు. ఎన్నోసార్లు చాలా నీచంగా మాట్లాడారని దుయ్యబట్టారు.
 
అభిమానుల మనసును మీరు ఎంతో బాధ పెట్టారని ఎస్కేఎన్ అన్నారు. ఛీ ఇవేం మాటలు అంటూ అందరూ చెవులు మూసుకునేలా చేశారని మండిపడ్డారు. ఎవరి కుటుంబాలైనా, ఎవరి పిల్లలైనా ఒక్కటేనని చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని... కానీ వ్యక్తిగతంగా దిగజారిపోయి కుటుంబాల మీద కామెంట్స్ చేసిన మీలాంటి వాళ్లు ఏ మాత్రం క్షమార్హులు కారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments