Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌‍లో విషాదం : 'బలగం' నటుడు కీసరి నర్సింగం మృతి

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (09:36 IST)
జబర్దస్త్ నటుడు వేణు దర్శకత్వం వహించిన బలగం చిత్రంలో సర్పంచి పాత్రను పోషించిన నటుడు కీసరి నర్సింగం మృతి చెందారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు దర్శకుడు వేణు ఎల్దండి శ్రద్ధాంజలి ఘటించారు. గత యేడాది వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రేక్షకాదారణ పొందడంతో నిర్మాతకు కనక వర్షం కురిపించింది. 
 
కుటుంబ విలువలు ఇతివృత్తంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో రూపొందిన 'బలగం' పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నర్సింగంతోపాటు మరికొందరు కళాకారులకు వేణు అవకాశం కల్పించి, వారికి గుర్తింపు తీసుకొచ్చారు. 
 
నర్సింగం మృతిపై వేణు స్పందిస్తూ, ఈ సినిమా కథ కోసం రీసెర్చ్ చేస్తున్న సమయంలో ముందుగా నర్సింగంనే కలిశానని గుర్తుచేసుకున్నారు. 'మీ చివరి రోజుల్లో 'బలగం' సినిమా ద్వారా మీలోని నటుణ్ని చూసుకుని.. మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నా' అని పేర్కొన్నారు.
 
అలాగే, పలువురు నెటిజన్లు సైతం నర్సింగం మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు. నర్సింగం మృతికి గల కారణాన్ని వేణు వెల్లడించలేదు. అనారోగ్యం కారణంగానే నర్సింగం తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments