Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీరాభిమానికి ప్రభాస్ వీడియో కాల్... ఉబ్బితబ్బిబ్బులైన శోభిత

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (10:15 IST)
కేన్సర్ మహమ్మారిబారినపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ వీరాభిమానికి హీరో ప్రభాస్ వీడియో కాల్ చేసి ఆశ్చర్యపరిచాడు. దీంతో ఆ అభిమాని ఆనందపరవశంలో మునిగిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శోభిత అనే అమ్మాయి ప్రభాస్ వీరాభిమాని. ఈమె కేన్సర్ బారినపడి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వస్తోంది. 
 
ఇటీవల ఆమె వైద్యులతో మాట్లాడుతూ, తాను ప్రభాస్ అభిమానినని, అతడితో మాట్లాడాలని ఉందని చెప్పింది. వైద్యుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రభాస్ శనివారం వీడియో కాల్‌ చేసి శోభితతో సరదాగా ముచ్చటించాడు. 
 
అభిమాన హీరో నుంచి ఫోన్ రావడంతో ఉబ్బితబ్బిబ్బయిన శోభిత తన బాధను మర్చిపోయి ప్రభాస్‌తో ఆనందంగా మాట్లాడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులకు ఫోన్ చేసి సర్‌ప్రైజ్ ఇవ్వడం ప్రభాస్‌కు కొత్తకాదు. గతంలో మిర్చి సినిమా షూటింగ్ సందర్భంగా భీమవరంలో మృత్యువుతో పోరాడుతున్న 20 ఏళ్ల అభిమానితోనూ ప్రభాస్ ఇలాగే ముచ్చటించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments