Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఈడీ విచారణకు రానున్న హీరో తరుణ్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (10:46 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ సెలెబ్రిటీలను విచారిస్తూ వస్తున్నారు. ఆ కోవలో బుధవారం హీరో తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. 
 
ఈ కేసులో మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటివరకు 11 మందిని విచారించిన అధికారులు.. జాబితాలో చివరిలో ఉన్న తరుణ్‌ను ఈ రోజు ప్రశ్నించనున్నారు. డ్రగ్స్ వాడే అలవాటు ఉందా? కెల్విన్‌తో సంబంధాలు ఉన్నాయా. అనే కోణంలో అధికారులు విచారించనున్నారు.
 
అలాగే, బ్యాంక్ స్టేట్‌మెంట్లతో విచారణకు హాజరుకావాలని తరుణ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌పై కూడా అధికారులు ప్రశ్నించనున్నారు. 'ఎఫ్ లాంజ్ పబ్' వ్యవహారాలు, నవదీప్ పార్టీలపై ఆరా తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 
 
కాగా గతంలో డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ విచారణకు హాజరైన తరుణ్.. విచారణలో భాగంగా తరుణ్ నుంచి అధికారులు నమూనాలు సేకరించి ఎఫ్ఎస్ఎల్‌కు పంపారు. అయితే ఆ నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్‌ నివేదిక ఇచ్చింది. దీంతో తరుణ్, పూరీ జగన్నాథ్‌లకు ఎక్సైజ్ శాఖ క్లీన్‌ చీట్ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments