Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో పెద్దలు టిక్కెట్లను బ్లాక్ చేసే అవకాశం వుంది.. మౌనం వీడిన కె.రాఘవేంద్ర రావు

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (19:20 IST)
సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, థియేటర్లలో టిక్కెట్ రేట్లను నిర్ణయించడంపై టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎల్లపుడు మౌనమునిగా ఉండే రాఘవేంద్ర రావు ప్రభుత్వ నిర్ణయంపై ఆయన అభిప్రాయాలను నిర్భయంగా ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. 
 
ఆన్‌లైన్ విధానం ద్వారా దోపిడీ ఆగిపోతుందనడం సరికాదన్నారు. ఒక ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూడదలచుకుంటే టిక్కెట్ ధర రూ.300 లేదా రూ.500 వెచ్చించి అయినా కొనుగోలు చేస్తాడన్నాడు. అదే అతనికి నచ్చని సినిమా అయితే, సినిమా టిక్కెట్ రూపాయికే ఇచ్చినా చూడడని వివరించారు.
 
ముఖ్యంగా ఆన్‌లైన్ విధానంలో చాలా మంది పెద్ద మనుషులు తమ పరపతిని ఉపయోగించి టిక్కెట్లను బ్లాక్‌ చేసుకునే అవకాశం ఉందని, అదే ఆన్‌లైన్‌లో రేట్లు పెంచి టిక్కెట్లు అమ్మితే ప్రభుత్వానికి కూడా అధిక పన్ను వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

ప్రతిపక్షహోదా ఇవ్వకపోయినా ప్రజా సమస్యల కోసం జగన్ సభకు వస్తున్నారు : వైవీ సుబ్బారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments