Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు కోల్పోయిన పవన్ అభిమాన కుటుంబాలకు ఆర్థికసాయం...

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (17:01 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని బ్యానర్లు కడుతూ విద్యుదాఘాతానికిగురై ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మెగా ఫ్యామిలీ హీరోలంతా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అంతేనా.. వారికి తమ వంతుగా ఆర్థిక సాయం చేశారు. అలా మొత్తం 12.50 లక్షల చొప్పున ఒక్కో మృతుని కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందనుంది. 
 
ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగింది. బ్యానర్లు కడుతున్న సమయంలో కరెంటు వైర్లు తగిలి రాజేంద్ర, అరుణాచలం, సోమశేఖర్ అనే ముగ్గురు పవన్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో వారి కుటుంబాలపై సానుభూతి పవనాలు వీస్తున్నాయి.
 
ఈ క్రమంలో జనసేన పార్టీ మాత్రమే కాకుండా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, 'వకీల్ సాబ్' చిత్రబృందం, మెగా సూర్య ప్రొడక్షన్స్ కూడా ఆర్థికసాయం ప్రకటించడం జరిగింది. 
 
ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.12.5 లక్షల మేర ఆర్థిక సాయం అందనుందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు విరాళం ప్రకటించిన అందరికీ పవన్ ధన్యవాదాలు తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

ఫ్యాంటు జేబులో పేలిన మొబైల్... తొడకు గాయాలు...

ఫ్లయింగ్ ట్యాంక్‌లు.. జూలైలో భారత్‌కు 3 అపాచీ హెలికాఫ్టర్లు

మద్యం సేవించి మొబైల్‍‌లో పాటలు పెట్టి బాలికలతో హెడ్మాస్టర్ అసభ్య నృత్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments