నేను తెలుగమ్మాయిని అలాంటి పాత్రలు చేయను... (Video)

'క్షణం' వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గూఢచారి'. ఇందులో తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ళ అనే యువతి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు మూడో తేదీన ప్రేక్షకుల ముందు

Webdunia
సోమవారం, 30 జులై 2018 (13:57 IST)
'క్షణం' వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గూఢచారి'. ఇందులో తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ళ అనే యువతి హీరోయిన్‌గా నటిస్తోంది.


ఈ చిత్రం ఆగస్టు మూడో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా శోభిత మాట్లాడుతూ, తాను అచ్చం తెలుగు అమ్మాయినని, అందాలు ఆరబోసే పాత్రలు చేయబోనని తేల్చి చెప్పింది.

అదేసమయంలో మిస్‌ ఇండియా కిరీటం గెలిచిన తర్వాత నాకు చాలా కాల్స్‌ వచ్చాయి. మా సినిమాల్లో నటించండి అంటూ చాలా మంది అడ్వాన్స్‌లు ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ నాకు అప్పుడు నటించే ఉద్దేశ్యం లేదు. ఇప్పుడు మాత్రం నటిని కావాలని బలమైన నిర్ణయం తీసుకున్నాను అని తెలిపింది. 
 
ఇకపోతే, 'గూఢచారి' చిత్రం గురించి స్పందిస్తూ, ఈ సినిమా భావోద్వేగం నిండిన సినిమా. ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నందుకు చాలా రావడం సంతోషంగా ఉంది. నేను ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా.. ఎప్పటికీ తెలుగు అమ్మాయినే. ఒకప్పుడు నాకు టాలీవుడ్‌, బాలీవుడ్ అనే తేడాలు ఉండేవి. ఇప్పుడు అస్సలు అలాంటివేమీ లేవని తెలిపింది. 
 
ఎందుకంటే.. నేను ఎనిమిదేళ్ల క్రితం ముంబైకు వెళ్లా. అక్కడ కొన్ని సినిమాలు చేశా. ఇప్పుడు ఈ సినిమా చేసిన తర్వాత నాకు భాషల మధ్య తేడా ఉందని అనిపించలేదు. అంతా ఒక్కటే అన్న భావన కలిగింది. ఏదో సినిమాలో అలా కనిపించామా? వెళ్లిపోయామా? అనే పాత్రలు చేయాలని లేదు. గుర్తింపు లభించే పాత్రలను మాత్రమే చేయాలి అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం

నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. ఆపై హత్యకు గురయ్యాడు...

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం: 44 మంది మృతి.. వందలాది మంది గల్లంతు

రైతులకు నష్ట పరిహారం ఇస్తానని.. ఏదో గుడిలో లడ్డూ అంటూ డైవర్ట్ చేసేస్తాడు.. జగన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments