Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో విషాదం.. చంద్రబోస్ ఇకలేరు...

Webdunia
ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (16:49 IST)
టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. పలు చిత్రాలతో పాటు.. బుల్లితెర సీరియళ్ళలో నటించిన నటుడు సుభాష్ చంద్రబోస్ మృతి చెందారు. ఆయన ఇటీవల ప్రమాదవశాత్తుజారి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఈయన 'నిన్నే పెళ్లాడుతా', 'ఇడియట్', 'శివమణి', 'అల్లరి రాముడు' వంటి అనేక చిత్రాల్లో నటించారు. అలాగే పలు టీవీ సీరియళ్లలో నటించాడు. ఆయన నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ కృష్ణానగర్‌లోని తన నివాసంలో ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దాంతో తలకు బలమైన గాయాలు తగిలాయి. బోస్ అప్పటి నుంచి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. 
 
అయితే, తలకు తగిలిన దెబ్బలు తీవ్రమైనవి కావడంతో ప్రాణాలు విడిచారు. బోస్ మరణంతో సినీ, టీవీ రంగాల్లో విషాదం అలుముకుంది. ఆయనతో అనుబంధం ఉన్న నటీనటులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ దాదాపు మూడు దశాబ్దాలుగా నట ప్రస్థానం కొనసాగిస్తున్నారు. సుమన్ హీరోగా వచ్చిన "సాహసపుత్రుడు" చిత్రంతో సినీ రంగానికి పరిచయం అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments