Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో విషాదం.. చంద్రబోస్ ఇకలేరు...

Webdunia
ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (16:49 IST)
టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. పలు చిత్రాలతో పాటు.. బుల్లితెర సీరియళ్ళలో నటించిన నటుడు సుభాష్ చంద్రబోస్ మృతి చెందారు. ఆయన ఇటీవల ప్రమాదవశాత్తుజారి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఈయన 'నిన్నే పెళ్లాడుతా', 'ఇడియట్', 'శివమణి', 'అల్లరి రాముడు' వంటి అనేక చిత్రాల్లో నటించారు. అలాగే పలు టీవీ సీరియళ్లలో నటించాడు. ఆయన నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ కృష్ణానగర్‌లోని తన నివాసంలో ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దాంతో తలకు బలమైన గాయాలు తగిలాయి. బోస్ అప్పటి నుంచి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. 
 
అయితే, తలకు తగిలిన దెబ్బలు తీవ్రమైనవి కావడంతో ప్రాణాలు విడిచారు. బోస్ మరణంతో సినీ, టీవీ రంగాల్లో విషాదం అలుముకుంది. ఆయనతో అనుబంధం ఉన్న నటీనటులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ దాదాపు మూడు దశాబ్దాలుగా నట ప్రస్థానం కొనసాగిస్తున్నారు. సుమన్ హీరోగా వచ్చిన "సాహసపుత్రుడు" చిత్రంతో సినీ రంగానికి పరిచయం అయ్యారు.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments