Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ యువ హీరో తండ్రి కరోనాతో మరణం

Webdunia
గురువారం, 9 జులై 2020 (10:33 IST)
కరోనావైరస్ ఎవరిని వదలడం లేదు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరి పైన తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. టాలీవుడ్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా బారిన పడిన నిర్మాత పోకూరి రామారావు ఇటీవల మృతి చెందారు. తాజాగా టాలీవుడ్ నటుడు ఈ రోజుల్లో ఫేం హీరో శ్రీ తండ్రి మంగం వెంకట దుర్గారాంప్రసాద్ కరోనాతో కన్నుమూసారు.
 
గత 20 రోజులుగా విజయవాడలో ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు తుది శ్వాస విడిచారు. కాగా ప్రముఖ డైరెక్టర్ మారుతి తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈరోజుల్లో శ్రీ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే.
 
ఆ తర్వాత అతడు లవ్ సైకిల్, పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ తదితర సినిమాల్లో నటించాడు. మరోవైపు సినీ పరిశ్రమల్లో కరోనా కలకలం సృష్టిస్తున్న విషయం కూడా తెలిసిందే. అంతేకాకుండా పలువురు టీవీ నటులు కూడా కరోనా బారిన పడ్డారు. టీవీ నటులు రవికృష్ణ, రాజశేఖర్, సాక్షి శివ, రవికృష్ణ, సీరియల్ నటి నవ్య స్వామికి కరోనా సోకిన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments