Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఫోటోకు జండూబామ్ పెట్టి ట్రోల్స్ చేశారు : దిల్ రాజు కౌంటర్

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (09:51 IST)
ప్రభాస్ హీరోగా ఓ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "ఆదిపురుష్". ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్‌ను చూసిన అనేక మంది ట్రోల్స్ మొదలుపెట్టారు. వీటిపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. ప్రతి సినిమాకు మొదటి రోజు నెగెటెవ్ వైబ్స్ సాధారణమన్నారు. కొంతమంది ఎపుడూ నెగెటివ్‌గా ఉంటారన్నారు. 
 
"ఆదిపురుష్" టీజర్ ఎపుడు వస్తుందా అని ప్రభాస్ అభిమానులే కాదు.. నేను కూడా ఆసక్తిగా ఎదురు చూశాను. టీజర్ రాగానే నేను మొదట ఫోనులో చూశా. వెంటనే ప్రభాస్‌కు ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. దీంతో అమేజింగ్ అని వాయిస్ మెసేజ్ పెట్టాను. బయట నుంచి ఇంటికి వెళ్లేలోపు టీజర్ రెస్పాన్స్ కనుక్కొందామని నలుగురైదుగురికి ఫోన్ చేస్తే ట్రోలింగ్ చేస్తున్నారు సర్ అని చెప్పారు. 
 
"బాహుబలి-1" మొదటిసారి చూసి బయటకు వచ్చినపుడు అందరూ ట్రోలింగ్ చేశారు. శివలింగాన్ని ఎత్తుకుని ప్రభాస్ వచ్చే ఫోటోకు జండూబామ్ పెట్టి పోస్టులు చేశారు. సినిమా సూపర్ హిట్ అని ప్రభాస్‌కు అపుడే చెప్పా. ఇలాంటి సినిమాలు థియేటర్‌లోనే చూడాలి. సెల్‌ఫోనులో చూసి సినిమాను అంచనా వేయలేం. వీఎఫ్ఎక్స్ సినిమాలను థియేటల్‌లో పూర్తి జనాలతో చూస్తే అర్థమవుతుంది. "ఆదిపరుష్" కూడా అలాంటి సినిమానే. ఇపుడు 3డీలో విజువల్స్ చూస్తే చాలా బాగుంది" అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments