Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ కోసం పెట్టిన ప‌రుగులు ఇంటికి ర‌ప్పించింది

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (20:27 IST)
Janasena karyakartha with pawan
ఇటీవ‌ల‌ రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ రోడ్ల‌ను శుభ్రంచేసే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హంచారు. ఆయ‌న ఇచ్చిన పిలుపుకు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు చోట్ల పాల్గొని శ్ర‌మ‌దానం చేశారు. ఎ.పి.లో రోడ్లు అద్వాన్నంగా వున్నాయ‌ని జ‌న‌సేన నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమ‌ర్శించారు. ఆయ‌న రాక‌తో రాజ‌మండ్రిలో పోలీసు బందోబ‌స్తు ముమ్మ‌రం చేశారు. కొన్ని చోట్ల మ‌హిళా కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు ప‌ర్మిష‌న్ లేద‌ని అడ్డుకున్నారు.
 
ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ రాక‌తో ఆయ‌న అభిమానులు బైక్‌ల‌తో ప‌ర్య‌టించి ఆయ‌న‌కు అండ‌గా నిలిచారు. అందులో భాగంగా ఓ కార్య‌క‌ర్త బైక్‌ఫై ఖాళీలేక‌పోవ‌డంతో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కారువెంబ‌డి ప‌రుగెత్తుకుంటూ వెళ్లి ఆయ‌న చేసే కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ విష‌యం తెలుసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాన్  త‌న పర్యటనలో కారు వెంట పరిగెత్తిన నిడగట్లకు  చెందిన జనసైనికుడిని ఈరోజు హైదరాబాద్ పిలిపించి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆ అభిమాని ఆనంద‌పార‌వ‌శ్యానికి లోన‌య్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్-ఇజ్రాయేల్ దాడులు.. ఎయిరిండియా కీలక నిర్ణయం.. ఏంటది?

MP: పన్నా జిల్లాలో గనిని తవ్వుతుండగా 2.69 క్యారెట్ల వజ్రం

25న మధ్యాహ్నం 12.01 గంటలకు శుభాంశు శుక్లా రోదసీయాత్ర

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం : ఏపీలో విస్తారంగా వర్షాలు

హమ్మయ్య... ఢిల్లీకి చేరుకున్న ఏపీ విద్యార్థులు.. ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments