Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌మంత న‌టించిన `ఓ బేబీ` నిర్మాత మ‌రో సినిమాకు రెడీ

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (19:22 IST)
sunita tati- philiprjohn etc
కొరియ‌న్ న‌వ‌ల ఆధారంగా తీసిన `మిస్‌గ్రానీ` సినిమాను `ఓ బేబీ`గా సునీత తాటి తెలుగులో నిర్మించారు. స‌మంత న‌టించిన ఆ సినిమా మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. తాజాగా సునీత తాటి మ‌రో ప్ర‌యోగాన్ని చేస్తున్నారు. టైమెరి మురారి ర‌చించిన అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ న‌వ‌ల ఆధారంగా తెలుగులో మ‌రో ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త‌న తండ్రికోసం వెతికే క్ర‌మంలో ఇండియా వ‌చ్చే కొడుకు క‌థ‌తో ఈ సినిమా రూపొంద‌బోతోంది.
 
తన తల్లి, సవతి తండ్రితో కలిసి అమెరికాలో నివసించే నిఖిల్ అనే అబ్బాయి కథను ఈ న‌వ‌ల చెబుతుంది. అతని తల్లి, సుష్మా అకా సూసీ (అమెరికాలో) అనుకోని స్థితిలో చ‌నిపోతుంది. అనంత‌రం తన నిజమైన తండ్రిని కనుగొనడానికి నిఖిల్ ఇండియాకు వెళ్లాలనే నిర్ణయంతో ఈ నవల మొదలవుతుంది- అతను ఇండియా వ‌స్తాడు. త‌ను అనుకున్నది సాధించాడా!లేదా! అనేది మిగిలిన క‌థ‌.
 
మంగ‌ళ‌వారంనాడు ఈ చిత్రం గురించి నిర్మాత ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. గురు ఫిలిం ప్రొడ‌క్ష‌న్స్‌పై రూపొంద‌నున్న ఈ సినిమాకు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం ఫిలిప్రోజోన్ వ‌హిస్తున్నారు. ఇందులో త‌ల్లి పాత్ర‌, కొడుకు పాత్ర ఎవ‌ర‌నేది త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాన‌ని పేర్కొన్నారు. దీనికి స‌హ ర‌చ‌న నిమ్మిహరసాగమ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో నూడిల్స్ సూప్ ఆర్డర్‌ చేస్తే మొబైల్ ఫోన్ వచ్చింది...

TDP Alliance: టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం 20 సంవత్సరాలు అధికారంలో వుంటుంది - పవన్

Asteroid: 2032లో ఒక పెద్ద గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టవచ్చు: శాస్త్రవేత్తల హెచ్చరిక

Mother: బాయ్‌ఫ్రెండ్ సాయంతో కన్నతల్లినే హత్య చేసిన కుమార్తె-చాకలి ఐలమ్మ ముని మనవరాలు..?

హైదరాబాద్ నగరంలో 42 డెంగ్యూ కేసులు- 2 రోజుల్లోనే 10 కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments