Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ది కాశ్మీర్ ఫైల్స్" చిత్ర దర్శకుడుకి వై కేటగిరీ భద్రత

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (15:48 IST)
కశ్మీర్ పండిట్ల ఊచకోత కథాంశంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం "ది కశ్మీర్ ఫైల్స్". ఈ చిత్ర దర్శకుడు వివేక్ అగ్రిహోత్రికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆయనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కల్పించింది. 
 
ఎలాంటి అంచనాలు లేకుండా ఇటీవల విడుదలైంది. కేవలం రూ.3 నుంచి రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించారు. కానీ, శుక్రవారానికి ఏకంగా రూ.100 కోట్ల మేరకు వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం. 
 
ఆ రోజుల్లో కశ్మీర్ పండిట్లు అనుభవించిన బాధలు, చూసిన నరకం, కశ్మీర్ పండిట్ల ఊచకోత తదితర అంశాలను దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమా చూసిన బయటకు వచ్చిన ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. 
 
అనేక వాస్తవ సంఘటనతో ఈ చిత్రాన్ని దర్శకుడు అగ్నిహోత్రి అద్భుతంగా తెరకెక్కించారని పలువురు అభినందలు తెలుపుతుంటే, మరికొందరు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. చంపుతామంటూ బెదిరిస్తున్నారు. 
 
దీంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరీ భద్రతను కల్పించింది. అంటే ఆయన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణగా ఉంటాయి. కాగా, బాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఈ తరహా భద్రతను నటి కంగనా రనౌత్‌కు ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: కారును ఢీకొన్న వ్యాన్.. నుజ్జు నుజ్జు.. ముగ్గురు మృతి

మహిళతో సహజీవనం... కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటూ వేధింపులు...

ఎవరైనా కొడితే కొట్టించుకోండి.. ఆ తర్వాత తుక్కు రేగ్గొట్టి సినిమా చూపిద్దాం : కేడర్‌కు జగన్ సూచన

Kurnool: జూలై 2 నుంచి కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు

యూపీఎస్సీ తుది జాబితా- తెలుగు రాష్ట్రాల నుంచి పది మంది అభ్యర్థులకు స్థానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments