Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతల కష్టాలను హీరోలు పట్టించుకోవడం లేదు : దిల్ రాజు

ఠాగూర్
బుధవారం, 5 మార్చి 2025 (14:55 IST)
సినీ హీరోలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. నిర్మాతల కష్టాలను హీరోలు పట్టించుకోవడం లేదన్నారు. పైరసీ వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని, హీరోలు మాత్రం నిర్మాతల నష్టపోతే మాకేంటి అనే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. 
 
ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, సినిమా పైరసీకి గురైతే నిర్మాత తీవ్రంగా నష్టపోతుండగా హీరోలు, ఇతర ఆర్టిస్టులు మాత్రం తమకేమిటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీని పైరసీ సమస్య తీవ్రంగా వేధిస్తుందన్నారు. సినిమా పైరసీకి గురైతే నిర్మాత మాత్రమే నష్టపోతున్నారని, హీరోలు సురక్షితంగా ఉంటున్నారన్నారు. 
 
నిర్మాత కష్టాన్ని పట్టించుకోకుండా తదుపరి ప్రాజెక్టులో బిజీగా మారిపోతున్నారని చెప్పారు. నిర్మాత నష్టపోతే మాకేంటి అనే ధోరణి సరికాదన్నారు. తమ వరకు వస్తే కానీ ఆ నొప్పి తెలియదని అన్నారు. త్వరలోనే ఈ విషయంపైనా మీటింగ్ పెట్టుకుంటామని ఆయన చెప్పారు. అలాగే, పైరసీపై తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంపై దృష్టిసారించినట్టు దిల్ రాజు వెల్లడించారు. ఇదే విషయంపై ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

పొరుగు రాష్ట్రాలకు అమరావతి కేంద్రంగా మారనుంది.. ఎలాగంటే?

ఫహల్గామ్ ఘటన.. తిరుమలలో అలెర్ట్- టీటీడీ యంత్రాంగం అప్రమత్తం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments