Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సీరియల్ నటుడికి కరోనా ... యూనిట్ సభ్యులంతా క్వారంటైన్

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (09:45 IST)
ఓ తెలుగు సీరియల్ నటుడికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయనతో కలిసి షూటింగ్‌లో పాల్గొన్న యూనిట్ సభ్యులందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. 
 
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ సడలింపులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ, టీవీ షూటింగులు ప్రారంభమైన విషయం తెల్సిందే. భౌతికదూరం పాటించాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాలు సినీ, టీవీ పరిశ్రమలకు స్పష్టం చేశాయి. 
 
కానీ, ఓ తెలుగు టీవీ సీరియల్ యూనిట్లో కరోనా కలకలం రేగింది. సీరియల్లో నటిస్తున్న ఓ నటుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ ధారావాహిక షూటింగ్ నిలిపివేశారు. యూనిట్ సభ్యులను క్వారంటైన్‌కు పంపారు. కాగా, ఈ తెలుగు టీవీ సీరియల్ ప్రముఖ చానల్లో ప్రసారమవుతోంది.
 
కరోనా సోకిన నటుడు తిరుపతి నుంచి నేరుగా షూటింగ్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ నటుడు ఎవరెవరిని కలిశాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సుదీర్ఘ లాక్డౌన్ తర్వాత షూటింగులు ప్రారంభమయ్యాయన్న ఆనందంలో ఉన్న బుల్లితెర నటీనటులు ఈ పరిణామంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఈ ఘటన మిగతా టీవీ సీరియళ్లపైనా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments