Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు ఒకటి నుంచి టాలీవుడ్‌లో షూటింగులు బంద్

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (15:57 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి సినిమా షూటింగులు ఆగిపోనున్నాయి. నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సినిమా షూటింగులు ఆగిపోనున్నాయి. ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయానికి ఫిల్మ్ చాంబర్ కూడా మద్దతు ప్రకటించింది. 
 
సినీ నిర్మాణంలో అధిక వ్యయం భరించలేకపోతున్నామంటూ గత కొంతకాలంగా నిర్మాతలు వాపోతున్న విషయం తెల్సిందే. దీనికితోడు ఒక కొత్త చిత్రాన్ని విడుదలైన కొన్ని వారాల తర్వాత ఓటీటీలకు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌ను వారు తెరపైకి తెచ్చారు. 
 
కాగా, షూటింగుల నిలిపివేతపై నిర్మాత దిల్ రాజు కీలక ప్రకటన చేయగా, ఆయనకు చిన్నాపెద్దా నిర్మాతలంతా ఒక్కతాటిపైకి వచ్చి మద్దతు ప్రకటించారు. అయితే, ఒకటో తేదీ నుంచి ఆగిపోయే షూటింగులను తిరిగి ఎపుడు పునరుద్ధరిస్తారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 
 
దీనిపై 24 క్రాఫ్టులతో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దీంతో సోమవారం నుంచి షూటింగులు ఆగిపోనున్నాయి. మరోవైపు, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ మాత్రం నిర్మాత దిల్ రాజు నిర్ణయాన్ని వ్యతిరేకించింది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments