Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ యాంకర్, కలిసుందాం రా నటి మల్లిక మృతి.. రెండు వారాలు కోమాలోనే వుండి?

ప్రముఖ టీవీ యాంకర్, సినీ నటి మల్లిక కన్నుమూశారు. తొలి తరం టీవీ యాంకర్‌గా పేరుతెచ్చుకున్న మల్లిక అనారోగ్యం కారణంగా కోమాలో వున్నారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించి బెంగళూరులో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచార

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (17:30 IST)
ప్రముఖ టీవీ యాంకర్, సినీ నటి మల్లిక కన్నుమూశారు. తొలి తరం టీవీ యాంకర్‌గా పేరుతెచ్చుకున్న మల్లిక అనారోగ్యం కారణంగా కోమాలో వున్నారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించి బెంగళూరులో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మల్లిక మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఆమె కుటుంబసభ్యులకు సినీ తారలు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆమె అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్‌లో జరగనున్నాయి. 
 
మరణించేనాటికి మల్లికకు 39 సంవత్సరాలు. భర్త బెంగళూరులో ఉద్యోగం చేస్తుండటంతో ఆమె అక్కడే నివాసం వున్నారు. మల్లికకు ఓ కుమారుడు ఉన్నాడు. అనారోగ్యంతో రెండు వారాల పాటు కోమాలోకి వెళ్లిపోయిన మల్లిక.. అసలు పేరు అభినవ.

వెంకటేష్ కలిసుందాం రా, నిన్నే పెళ్ళాడుతా వంటి పలు  సినిమాల్లో ఆమె నటించారు. యాంకర్‌గా, సీరియల్ నటిగా ప్రేక్షకుల ఆదరణ పొందిన మల్లిక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1999లో కృష్ణగారి రాజకుమారుడు చిత్రంలోనూ నటించారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments