Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఒట్టు' ... కేరళకు మకాం మార్చిన వరంగల్ బ్యూటీ!

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (20:19 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న ఒకరిద్దరు తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బా ఒకరు. చిన్నచిన్న పాత్రలతో తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ తెలుగుపిల్ల... హీరోయిన్‌గా నిలదొక్కుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. 
 
ఈ భామ ఇటీవ‌ల సోష‌ల్‌మీడియాలో గ్గామ‌ర‌స్‌, స్టైలిష్ స్టిల్స్‌ను పోస్ట్ చేయ‌గా.. ఆ ఫొటోలు కుర్ర‌కారుకు నిద్ర‌ప‌ట్ట‌కుండా చేశాయి.. చేస్తున్నాయి. చివ‌రిసారిగా తెలుగులో "అర‌వింద స‌మేత" లాంటి పెద్ద చిత్రంలో సెకండ్ లీడ్ రోల్‌లో క‌నిపించింది. 
 
అయితే ఆ త‌ర్వాత 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' మిన‌హా ఈ భామకు తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో త‌మిళం, మ‌ల‌యాళంపై దృష్టి పెట్టింది. ఈషారెబ్బా మ‌ల‌యాళంలో "ఒట్టు" అనే చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఈ విష‌యాన్ని ట్విట్టర్ ద్వారా తెలియ‌జేస్తూ ఎక్జ‌యిటెడ్‌గా ఉంద‌ని ట్వీట్ చేసింది.
 
మ‌రోవైపు త‌మిళ సినిమాలో కూడా న‌టిస్తోంది. ఈషారెబ్బా త‌న మ‌కాంను కేర‌ళ‌కు మార్చేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో జోరుగా టాక్ న‌డుస్తోంది. మ‌రి కేర‌ళ కుట్టీలు తెలుగులో రాణిస్తున్న‌ట్టే.. ఈషా రెబ్బా కూడా మాలీవుడ్‌లో పాగా వేయాల‌ని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ ఈషా రెబ్బా అంటూ విషెస్ చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments