క్రేజీ ప్రాజెక్ట్‌లో తెలుగింటి అమ్మాయి...

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (16:03 IST)
హీరోయిన్ బిందుమాధవి తెలుగు ఆడపడుచు అయినా ఎక్కువగా తమిళ సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 'కళుగు' అనే తమిళ సినిమాలో ఆమె నటనకు అనేక ప్రశంసలు దక్కాయి. అయితే ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు లేక కనుమరుగైపోయిన ఈమెకు ఓ లక్కీఛాన్స్ తలుపు తట్టిందని సమాచారం.
 
కోలీవుడ్‌లో పేరున్న దర్శకుడు బాలా ఎప్పుడూ వాస్తవిక సినిమాలు చేస్తుంటారు. వీటిలో నటులెంత వాళ్లైనా పాత్రలే కనిపిస్తాయి. బాలా యువ హీరోలతో మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో సూర్య హీరోగా చిత్రం చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. బాలా చెప్పిన కథ సూర్యకు బాగా నచ్చినప్పటికీ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడింది.
 
దీంతో బాలా సినిమాలో ప్రస్తుతం నటించలేనని సూర్య చెప్పడంతో ఆయన మరో కథను తయారు చేసుకున్నారు. ఇందులో హీరోలుగా ఆర్య, అధర్వ నటిస్తున్నారు. ఈ సినిమాలో బిందుమాధవికి నటించే అవకాశం వచ్చిందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments