Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రుతిహాసన్‌ను పీవీపీ బ్లాక్ మెయిల్ చేసి.. కాల్ షీట్లు తీసుకున్నారు: నాని

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (17:56 IST)
సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తె, సినీనటి, శ్రుతిహాసన్‌పై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కామెంట్లు చేశారు. శ్రుతిహాసన్‌ను పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) బ్లాక్ మెయిల్ చేశారని నాని ఆరోపించారు. ఆమెను బ్లాక్ మెయిల్ చేసి, కాల్ షీట్లు తీసుకున్నారన్నారు. టాలీవుడ్‌లో ప్రిన్స్ మహేశ్ బాబును తప్ప అందరినీ ఇబ్బంది పెట్టారన్నారు. 
 
సినీ పరిశ్రమలో ఎందరో హీరోయిన్లను ఆయన ఏడిపించారని విమర్శించారు. మహేశ్ బాబు మాత్రమే పీవీపీ చేతికి చిక్కలేదని చెప్పారు. దర్శకులను కూడా వదలలేదని.. లీగల్ నోటీసుల పేరిట బ్లాక్ మెయిల్స్ చేసి నటీమణుల వద్ద డేట్లను తీసుకునేవారని చెప్పారు. సినీ ఇండస్ట్రీ మొత్తానికి ఇతనంటే అసహ్యం పుట్టిందని ధ్వజమెత్తారు. 
 
పీవీపీ మోసగాడని, క్రిమినల్ అంటూ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. చిన్నప్పటి నుంచే ఆయన ఓ నేరగాడని దుయ్యబట్టారు. కెనరాబ్యాంకుకు రూ. 137 కోట్లు ఎగ్గొడితే మొన్ననే నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఇతను తాకట్టు పెట్టిన ఆస్తిని బ్యాంకు వాళ్లు వేళం వేస్తే, కనీసం రూ. 7 కోట్లు కూడా రాలేదని చెప్పారు. జగతి పబ్లికేషన్స్‌లో రూ. 147 కోట్ల మనీలాండరింగ్ కేసులు, హవాలా కేసులు, బొగ్గు స్కాములు ఉన్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments