Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా? తమ్మారెడ్డి ఏమంటున్నారు?

మెగాస్టార్ చిరంజీవితో అనుబంధంపై టాలీవుడ్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చిరంజీవితో తనకు పడదని చాలా మంది అనుకుంటుంటారని... ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని భావిస్తుంటారని, అయి

Webdunia
సోమవారం, 2 జులై 2018 (17:45 IST)
మెగాస్టార్ చిరంజీవితో అనుబంధంపై టాలీవుడ్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చిరంజీవితో తనకు పడదని చాలా మంది అనుకుంటుంటారని... ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందని భావిస్తుంటారని, అయితే అదంతా అవాస్తవమని తమ్మారెడ్డి తెలిపారు. పైగా, తన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ ఫోన్‌కాల్ చిరంజీవి దగ్గర నుంచే వచ్చిందని, తనకు శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు. ఆయన కాల్ చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పారు.
 
తన ఆత్మీయులతో కలసి సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆదివారం పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత యేడాది తన పుట్టినరోజైన రెండు రోజులకు తన కుటుంబంలో ఓ విషాదకర సంఘటన జరిగిందన్నారు. ఆ బాధ నుంచి బయటపడేందుకే నావాళ్లు అనుకునే వారి మధ్య ఈ పుట్టిన రోజును జరుపుకున్నానని వివరించారు. 
 
తన జీవితంలో ఇండస్ట్రీ తప్ప మరెవరూ లేరని... రాజకీయ నేతలు కూడా తనతో మంచిగా మాట్లాడతారని, కానీ తనకు ఇండస్ట్రీనే ప్రపంచమని అన్నారు. చిరంజీవితో తనకు పడదని చాలా మంది అనుకుంటుంటారని...  తన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ ఫోన్ కాల్ చిరంజీవి దగ్గర నుంచే వచ్చిందని, తనకు శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు. ఆయన కాల్ చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పారు. 
 
అదేసమయంలో ఇండస్ట్రీలో తనకు శత్రువులు ఎవరూ లేరని... తాను పరుషంతో మాట్లాడినా అది ప్రేమతోనే అని, ద్వేషంతో తాను ఎన్నడూ మాట్లాడనని తెలిపారు. ఏదైనా ప్రేమతోనే జయించగలమనేది తన నమ్మకమని చెప్పారు. తన కంటే వెనుక ఇండస్ట్రీకి వచ్చిన వారు తనకన్నా పైస్థాయికి చేరితే ఆనందించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని తానని తమ్మారెడ్డి వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments