Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన వాణి జయరాం అంత్యక్రియలు

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (18:23 IST)
సుప్రసిద్ధ గాయని వాణీ జయారం అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. ఆమె భౌతికాయానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పించారు. వాణీ జయరాం శనివారం తన నివాసంలోనే కన్నుమూసిన విషయం తెల్సిందే. పడక గదిలో కిందపడటంతో తలకు బలమైన గాయం తగిలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాలు విడిచారు. అయితే, ఆమె నుదుటిపై గాయం ఉండటంతో వాణీ జయరాం మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. 
 
కాగా, 78 యేళ్ళ వాణీ జయరాం చెన్నై నుంగంబాక్కంలోని తన నివాసంలో ఒంటరిగా జీవిస్తున్నారు. ఈమె భర్త గత 2018లో చనిపోయారు. అప్పటి నుంచి ఆ ఇంట్లో ఆమె ఉంటున్నారు. ఆమె ఇంట్లో మలర్కొడి అనే పనిమనిషి పని చేస్తున్నారు. వాణి జయరాం కిందపడిన సమయంలో పని మనిషి కూడా లేరు. 
 
మరోవైపు, వాణీ జయరాం భౌతికకాయానికి ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదివారం నివాళులు అర్పించారు. అలాగే, మరికొందరు సినీ ప్రముఖులు కూడా అంజలి ఘటించారు. ఆ తర్వాత ఆమె భౌతికకాయాన్ని అంతిమయాత్రగా బీసెంట్ నగరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments