Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ కన్నుమూత

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (09:46 IST)
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ దర్శక దిగ్గజం జె.మహేంద్రన్ కన్నుమూశారు. ఈయన వయసు 79 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన మంగళవారం కన్నుమూశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న‌యుడు జాన్ మ‌హేంద్ర‌న్‌ వెల్లడించారు. 
 
ఈయన అనేక హిట్ చిత్రాలను తెరకెక్కించారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు గుర్తింపునిచ్చిన దర్శకుల్లో ఈయన ఒకరు. మహేంద్రన్ దర్శకత్వంలో 'ముల్లుమ్ మ‌ల‌రుమ్'‌, 'జానీ', 'నెంజ‌తై కిల్లాడే' వంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు మ‌హేంద్ర‌న్‌కి ఎంత‌గానో పేరు తెచ్చిపెట్టాయి. 
 
న‌టుడిగాను ప‌లు చిత్రాలలో న‌టించిన ఆయ‌న రీసెంట్‌గా విజ‌య్ సేతుప‌తి 'సీతాకాతి', ర‌జ‌నీకాంత్ 'పేటా' వంటి చిత్రాల్లో నటించారు. పైగా, 2018లో ఆయ‌న జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఆయ‌న మ‌ర‌ణంతో త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ విషాదంలో మునిగిపోయింది. ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ఆ దైవాన్ని కోరుతున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments