Webdunia - Bharat's app for daily news and videos

Install App

హేమనాథ్ అలాంటి పని చేస్తున్నాడు.. బుల్లితెర నటి చిత్ర తండ్రి ఫైర్

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (14:51 IST)
కోలీవుడ్ బుల్లితెర నటి చిత్ర 2020లో తిరువళ్లూరులోని నజరేత్ పేటలోని ఓ స్టార్ హోటల్‌లో శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి చిత్రను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు భర్త హేమ్‌నాథ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
తిరువళ్లూరు మహిళా ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును చెన్నైకి బదిలీ చేయాలని, కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించాలని చిత్ర తండ్రి కామరాజ్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినా.. విచారణలో పురోగతి లేదని చిత్ర తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అలాగే హేమ్‌నాథ్‌ కేసును జాప్యం చేయాలంటూ 2021 నుంచి పలు పిటిషన్లు వేస్తున్నారని పిటిషన్‌లో చిత్ర తండ్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు ఛార్జిషీటు నమోదు చేసే దశలో ఉంది. అంతే కాకుండా వయోభారం కారణంగా కేసు విచారణ నిమిత్తం తిరువళ్లూరు వెళ్లడం కష్టమని, అందుకే కేసును తిరువళ్లూరు నుంచి చెన్నైకి బదిలీ చేయాలని అభ్యర్థించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్‌లో భర్త హత్య : భార్య ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు

అమరావతి మహిళల దెబ్బకు గేట్లకు తాళం వేసుకున్న సాక్షి యాజమాన్యం

Honeymoon: హనీమూన్‌కి వెళ్లిన మరో నవ దంపతులు.. ఏమయ్యారో తెలియట్లేదు..?

Karnataka: అత్తమామల గొడవ.. రాజీ కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు

ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేసిన తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments