Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్లికట్టు నిర్వహణ కుదరదంటే దేశం విడిచి వెళ్లిపోతా!: తమిళ హీరో శింబు

తమిళ సంప్రదాయ గ్రామీణ క్రీడ జల్లికట్టు పోటీల నిర్వహణ కుదరదంటే... తాను ఈ దేశాన్ని విడిచిపోతానంటూ తమిళ హీరో శింబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనాదిగా వస్తున్న తమ సంప్రదాయం ఉనికినే కోల్పోయే పరిస్థితి దాపురిం

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (14:45 IST)
తమిళ సంప్రదాయ గ్రామీణ క్రీడ జల్లికట్టు పోటీల నిర్వహణ కుదరదంటే... తాను ఈ దేశాన్ని విడిచిపోతానంటూ తమిళ హీరో శింబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనాదిగా వస్తున్న తమ సంప్రదాయం ఉనికినే కోల్పోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. జల్లికట్టు కోసం విడివిడిగా పోరాటం చేస్తే ఫలితం ఉండదని... అందరం కలసికట్టుగా పని చేయాలని సూచించాడు. తమ సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నాడు. జల్లికట్టు కోసం తన ఇంటి ముందు పది నిమిషాలు మౌనం పాటిస్తానని చెప్పాడు. 
 
ఇదే అంశంపై శింబు చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సమస్యలతో తమిళ ప్రజలు సతమతమవుతూనే ఉన్నారన్నారు. వీటి పరిష్కారం కోస ఎన్నో పోరాటాలు చేస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌లో ఎవరైనా మరణిస్తే భారతీయుడు చనిపోయారంటారు. అదే కన్యాకుమారిలో చనిపోతే తమిళ జాలరి మృతి చెందాడంటారు. ఎందుకింత వివక్ష. తాము కూడా భారతీయులమే కదా అని ప్రశ్నించాడు. 
 
మరోవైపు... జల్లికట్టు పోటీల నిర్వహణపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పైగా, జల్లికట్టుపై త్వరగా తీర్పు ఇవ్వాలని కోరుతూ తమిళనాడు న్యాయవాదులు కోరడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పు విషయంలో న్యాయ‌వాదులు ఇలా కోరడం స‌రికాద‌ని చివాట్లు పెట్టింది. తీర్పు ఎప్పుడివ్వాలో తమకు తెలుసని సుప్రీంకోర్టు పేర్కొంది. త‌మ‌పై న్యాయ‌వాదులు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం లేదని స్ప‌ష్టం చేసింది. 
 
తమిళనాడులో సంక్రాంతి సంద‌ర్భంగా సుమారు రెండువేల ఏళ్లుగా జల్లికట్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విష‌యం తెలిసిందే. జంతుహింస అన్న కారణంగా అభ్యంత‌రం వ్య‌క్తం కావ‌డంతో 2014 మే 7వ తేదీన జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అయితే, ఆ నిషేధాన్ని ఎత్తివేయాల‌ని కోరుతూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం విన్న‌తులు చేసుకుంటోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments