Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మనసాక్షిని చంపుకుని జీవించలేను... తాప్సీ

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (13:41 IST)
బాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ నటి తనూశ్రీ దత్తా అంశం కుదిపేస్తోంది. ఈమె పట్ల హీరో నానా పటేకర్ అసభ్యంగా ప్రవర్తించినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలు కూడా తనూశ్రీ దత్తానే చేసింది. దీంతో ఈ ఆరోపణలపై ఇపుడు తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన హీరోయిన్ తాప్సీ. ఆమె తనూశ్రీ దత్తా వ్యవహారంపై స్పందించింది.
 
ఈ విషయంలో తాప్సీ చేసిన వ్యాఖ్యలను పరిశీలిద్ధాం... 'సంఘటన జరిగినప్పుడే దాని గురించి బహిరంగంగా చెప్పవచ్చుగా అని నేను తనూశ్రీ దత్తాను అడగదలచుకోలేదు. ఆమె ఇంతకు ముందే ఫిర్యాదు చేసింది. కానీ అప్పట్లో ఆమె గొంతు నొక్కేశారు. దీంతో తనూశ్రీ ఇప్పుడు వాయిస్‌ పెంచింది. నాకు ఆమె మీద గానీ, తన ఉద్దేశంపైగానీ ఎలాంటిసందేహాలు లేవు. ఆమె అసభ్య సంఘటనకు గురైంది. అందుకు ఆధారాలు ఉన్నాయి. అందుకే 10 ఏళ్ల తర్వాత గానీ, 40 ఏళ్ల తర్వాత గానీ ఫిర్యాదు చేయడం పెద్ద విషయం కాదన్నారు.. 
 
పైగా, నాటి సంఘటనలకు సంబంధించిన ప్రశ్నలకు తనూశ్రీ దత్తా చాలా ధైర్యంగా బదులిస్తున్నారు. అందులో ఆమె నిజాయితీ తెలుస్తోంది. తనూశ్రీదత్తాను చూసి ఆమెలా బాధింపునకు గురైనవారు ముందుకొచ్చి ధైర్యంగా చెప్పాలన్నది నా భావన. ఆమె విషయంలో నా మనసుకు అనిపించింది నేను మాట్లాడుతున్నాను. పైగా నేను నా మనసాక్షిని చంపుకుని జీవించలేను. ఇతరులేమనుకుంటారు అని భయపడుతూ జీవించలేను. నాకు నచ్చిన విధంగానే జీవిస్తాను. నా మససు స్వచ్ఛంగా ఉండబట్టే రాత్రుల్లో ప్రశాంతంగా నిద్రించగలుగుతున్నాను అని తాప్సీ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments