ఆ మాటలు వైసీపీ ఉగ్రశిక్షణ ప్రభావం.. జనసేనలో చేరుతా : 'థర్టీ ఇయర్ ఇండస్ట్రీ' పృథ్వీ

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (08:51 IST)
వైకాపా అనే ఉగ్రవాద కేంద్రంలో ఇచ్చిన శిక్షణ ప్రభావంతోనే మెగాబ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అనరాని మాటలు అన్నాని వారు సహృదయంతో క్షమించాలని తెలుగు నటుడు, థర్టీ ఇయర్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్ అన్నారు. పైగా, టీడీపీ చీఫ్ చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని, ఇందుకోసం ఆయన కాళ్లు పట్టుకుని దండం పెట్టేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 
 
ఆయన ఓ తెలుగు పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అనేక అంశాలపై తన మనస్సులోని మాటలను కుండ బద్ధలుకొట్టినట్టు చెప్పేశారు. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) ఛైర్మన్‌గా పని చేసిన సమయంలో తాను గొప్పవాడినన్న అహంతో పాటు గర్వం పెరిగిందన్నారు. దీంతో ఎవరినీ లెక్కచేయకుండా అనరాని మాటలు అన్నానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 
 
చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వంటి వారిని అనరాని మాటలు అన్నానని, అయితే, వారు పెద్ద మనసుతో సీరియస్‌గా తీసుకోకపోగా సహృదయంతో అర్థం చేసుకున్నారన్నరు. తాను తప్పు చేశానని, మీ కాళ్లకు దండం పెడతానని చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుకు చెప్పానని వెల్లడించారు. 
 
తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, జరిగిందేదో జరిగిపోయింది.. సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని వారు తనకు సూచించారని చెప్పారు. అదేసమయంలో 2024లో ఓ మంచి బస్సు ఎక్కి సపోర్ట్ చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా, జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇదే విషయాన్ని పవన్‌కు చెప్పగా, తప్పకుండా పిలుస్తానని, ఇప్పటికి సినిమాలు చేసుకోవాలని సలహా ఇచ్చారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments