సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు.. సుప్రీం కీలక నిర్ణయం.. సీబీఐకి అప్పగింత

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (13:13 IST)
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు విచారణకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుని సీబీఐకి అప్పగించింది. జూన్‌ 14లో సుశాంత్‌ తన నివాసంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం తెలపగా.. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. 
 
ఇప్పటివరకూ ఈ కేసుకి సంబంధించి సేకరించిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో పాటు సీబీఐ విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. సుశాంత్‌ ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలు. ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా పాత్రపైన ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో రియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం న్యాయబద్ధమైనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
 
ఈ కేసులో సింగిల్ బెంచ్ జస్టిస్ హృషికేశ్ రాయ్ ఇచ్చిన తీర్పును సుశాంత్‌ కుటుంబసభ్యులు స్వాగతించారు. దీంతో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే రియా పాత్రపై, సుశాంత్‌కి చెందిన కోట్లాది రూపాయలు ఆమె అకౌంట్‌కు బదిలీ అయిన విషయాలపై ఆమెను ప్రశ్నించారు. అయితే తనకేం తెలియదని ఆమె చెబుతోంది.
 
సుప్రీం నిర్ణయంపై బాలీవుడ్లో ట్వీట్ల వరద పారుతోంది. సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ హర్షం వ్యక్తం చేశారు. విజయానికి, నిష్పాక్షిక దర్యాప్తునకు తొలి అడుగు పడిందంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రార్థనలకు ఫలితం లభించిందంటూ ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రఘు రామ కృష్ణంరాజు కస్టడీ కేసు.. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు

డ్యాన్సర్‌తో అశ్లీల నృత్యం చేసిన హోంగార్డు.. పిల్లలు, మహిళల ముందే...?

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments