డ్రగ్స్ కేసు.. ఎన్సీబీ విచారణ ఓవర్.. దీపికా పదుకునేకు రెండోసారి సమన్లు

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (20:50 IST)
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణ ముగిసింది. బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకునేకు రెండోసారి సమన్లు ఇవ్వమని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం నలుగురు హీరోయిన్లను ప్రశ్నించామని అధికారులు తెలిపారు. శనివారం నలుగురి స్టేట్మెంట్‌లను రికార్డ్ చేశామని అన్నారు. సారా ఆలీఖాన్, శ్రద్దా కపూర్‌లను రెండు కేసుల్లో ప్రశ్నించామని అధికారులు పేర్కొన్నారు.
 
ఇక కరణ్ జోహార్‌కు ఈ కేసుతో సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే 19 మందిని అరెస్ట్ చేశామని ఎన్సీబీ అధికారులు పేర్కొన్నారు. కేవలం దీపిక చాటింగ్‌ను మాత్రమే పరిశీలించామని సుశాంత్ కేసు ఆధారంగానే వీరిని ప్రశ్నించామని పేర్కొన్నారు. 
 
రియా చక్రవర్తి సారా అలీ ఖాన్, శ్రద్దా కపూర్ పేర్లు చెప్పిందని, కానీ విచారణలో మాత్రం వారిద్దరూ డ్రగ్స్ వాడలేదని తెలిపారని చెప్పారు. ఈ కేసులో ధర్మా ప్రొడక్షన్‌కు చెందిన క్షితిస్ ప్రసాద్‌ను అరెస్ట్ చేశామని అధికారులు ప్రకటించారు.
 
ఇకపోతే.. ఈ విచారణలో పలు కీలక విషయాల్ని దీపిక వెల్లడించినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తన మేనేజర్ కరిష్మాతో 2017లో జరిపిన వాట్సాప్ ఛాటింగ్స్ తనవేనని దీపిక అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే డ్రగ్స్ మాత్రం ఎప్పుడూ తీసుకోలేదని తెలిపిందట. 
 
దాదాపు ఇవే రకమైన ప్రశ్నల్మి మిగతా ఇద్దరు హీరోయిన్లు శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ ఎదుర్కొన్నారు. సుశాంత్‌తో తాము పార్టీలకు హాజరైన విషయాన్ని వీళ్లు అంగీకరించారు. అయితే అక్కడ మాదకద్రవ్యాలు సేవించలేదని వీళ్లు అధికారులకు తెలియజేశారు.
 
ప్రస్తుతానికి వీళ్ల ముగ్గుర్ని ఇంటికి పంపించిన అధికారులు.. మరోసారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. వీళ్లలో దీపిక చెప్పిన సమాధానాలపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేయలేదంటూ జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రంప్‌ను ఛీకొట్టిన న్యూయార్క్ ప్రజలు: పనిచేసిన ఉచిత బస్సు పథకం, మేయర్‌గా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్

భార్యాభర్తల గొడవ- ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వదిలేసిన తండ్రి.. తర్వాత ఏం జరిగింది?

హైదరాబాద్-విజయవాడ హైవే.. నాలుగు నుంచి ఆరు లేన్లు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

నేను నమ్మని దాన్ని ప్రజలకు చెప్పలేను, అలా రూ 150 కోట్లు వదిలేసిన పవన్ కల్యాణ్

Python: తిరుమల రెండో ఘాట్‌లో పెద్ద కొండ చిలువ కలకలం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments