Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి కిడ్నాప్ కేసు.. విచారణ మరో 6 నెలలు పొడిగింపు

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (20:49 IST)
ప్రముఖ మలయాళ నటుడు, సూపర్ స్టార్ దిలీప్.. గత 2019వ సంవత్సరం టాప్ హీరోయిన్ కిడ్నాప్ కేసులో అరెస్టయ్యారు. ఈ కేసు విచారణకు అత్యున్నత న్యాయస్థానం మరో ఆరు నెలల పాటు సమయాన్ని పొడిగించింది. ఈ కేసు కేరళలోని ఎర్నాకుళం అదనపు స్పెషల్ సెషన్స్ కోర్టులో గత 2019వ సంవత్సరం నుంచి విచారణ జరుగుతోంది. 
 
అయితే ఈ కోర్టు సుప్రీం కోర్టు నిర్దేశించిన సమయంలోపు విచారణను పూర్తి చేయలేకపోయింది. కరోనా కారణంగా కేసు విచారణలో జాప్యం ఏర్పడింది. అందుచేత ఆరు నెలల పాటు సమయాన్ని పొడిగించాలని స్పెషల్ కోర్టు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. హైకోర్టు ఈ కేసు విచారణకు ఆరునెలల పాటు సమయం ఇచ్చింది. ట్రయల్ ప్రొసీడింగ్స్ పూర్తి చేయడానికి కేరళలోని ఎర్నాకుళం అదనపు స్పెషల్ సెషన్స్ జడ్జి నుండి 2021 జనవరి 16 నాటి అభ్యర్థన మేరకు ఈ ఉత్తర్వు వచ్చింది. క్రిమినల్ ప్రొసీడింగ్స్ పూర్తి చేయడానికి గడువును సుప్రీం కోర్టు ఇంతకుముందు ఆరు నెలలు పొడిగించింది. 2021 ఫిబ్రవరి 4 లోగా విచారణ పూర్తి చేయాలని కోర్టును కోరింది
 
కరోనా మహమ్మారి, ఇతర అనివార్య కారణాల చేత విచారణ ఆలస్యం అయింది. ఈ కేసులో జాబితా చేయబడిన దాదాపు 300 మంది సాక్షులలో 82 మందిని మాత్రమే ప్రాసిక్యూషన్ పరిశీలించగలిగింది. దీంతో విచారణను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments