Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పటికీ నాతో కలిసి పనిచేయడానికి జంకుతున్నారు : సన్నీ లియోన్

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (20:09 IST)
అడల్ట్ చిత్రాల నటి సన్నీ లియోన్ తాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆరంభంలో పోర్న్ చిత్రాల్లో నటించిన మాట నిజమేనని, అయితే, ఆ చిత్రపరిశ్రమను వదిలివేసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి పదేళ్లు అయిందని తెలిపారు. ఇప్పటికీ తనతో కలిసి పని చేసేందుకు అనేక మంది వెనుకంజ వేస్తున్నారని సన్నీ లియోన్ అంటున్నారు. 
 
గత 2012లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సన్నీ లియోన్... ఆమె నటించిన తొలి చిత్రం "జిస్మ్-2". అయితే పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "2012లో పరిశ్రమలో అడుగుపెట్టే నాటికి నేను పూర్తిగా భిన్నమైన వ్యక్తి. నేను మెరుగైన జీవితం గురించి ఆలోచించి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినట్టు చెప్పారు. 
 
పైగా, ఇప్పటివరకు తాను చేసిన పాత్రల విషయంలోను సంతోషంగానే ఉన్నట్టు చెప్పారు. అందులో మంచి, చెడు ఎంపికలు కూడా ఉన్నాయని వెల్లడించారు. అద్భుతమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం వచ్చిందని తెలిపారు. నేను అడుగుపెట్టినపుడు ఈ స్థాయిలో పరిశ్రమను ప్రేమిస్తానని ఊహించలేదన్నారు. నాకు మద్దతు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. 
 
అయితే, ఇప్పటికీ నాతో కలిసి పని చేసేందుకు అనేక మంది ఆసక్తి చూపడంలేదు. అదేవిధంగా పేరొందిన నిర్మాణ సంస్థలు, వ్యక్తులు సైతం ఇప్పటికీ నాతో కలిసి పని చేయడానికి సంకోచిస్తున్నారు. కానీ, ఇదేమీ నన్ను బాధపెట్టదు. ఏదో ఒక రోజు వారితోనూ కలిసి పని చేసే అవకాశం వస్తుందని భావిస్తున్నాను అని 41 యేళ్ళ సన్నీ లియోన్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ హత్య కేసు : భర్త మృతదేహం వద్ద భార్య ప్రియుడు..

యూఎస్ ఎయిర్ పోర్టులో భారతీయ విద్యార్థిని చేతికి సంకెళ్లు వేసి అలా కట్టిపడేశారు

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ - యేడాదిగా బలవంతపు వసూళ్లు!

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం