Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కి కోర్టు షాక్

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (14:54 IST)
సోషల్ మీడియాల పుణ్యమా అని ఎవరిపై అయినా నిరాధారంగా వ్యాఖ్యలు చేసేస్తూంటే... ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చవి చూడబోతున్నారు ఈ బాలీవుడ్ హీరోయిన్, ఆవిడ సోదరీమణులు. 
 
వివరాలలోకి వెళ్తే... ఈ మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆవిడగారి సోదరి రంగోలీ చండేల్‌లు సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులోనూ బాలీవుడ్ స్టార్స్‌పై రంగోలీ చేస్తున్న సోషల్ మీడియా పోస్ట్‌లయితే పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. 
 
కాగా... గతంలో వీరు చేసిన వ్యాఖ్యల కారణంగా పరువు పోయిందంటూ నటుడు ఆదిత్య పంచోలి, ఆయన భార్య జరీనాలు పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా కంగనా సిస్టర్స్‌ను స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ అయ్యాయి.
 
కేసు వివరాలలోకి వెళ్తే... తన కెరీర్ ఆరంభంలో ఆదిత్య పంచోలి తనను గృహ నిర్బంధం చేసాడంటూ కంగనా ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆవిడ సోదరి రంగోలీ కూడా కంగనా వ్యాఖ్యలను సమర్ధిస్తూ సోషల్ మీడియా ద్వారా తన సోదరిని ఆదిత్య రేప్ కూడా చేసాడనీ... తాము అప్పట్లోనే కేసు పెట్టామనీ.. ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యిందంటూ పేర్కొన్నారు. అయితే ఆదిత్య పంచోలి మాత్రం తనపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదనీ.. వారు చేస్తున్నవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు అంటూ వాదిస్తూ వస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో తన పరువు పోయేలా పదేపదే తనను టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శల కారణంగా తన పరువుకు భంగం వాటిల్లిందంటూ ఆదిత్య కోర్టుకు వెళ్లాడు. కాగా, ఇప్పటివరకు కంగనా సిస్టర్స్ తరపున వారి న్యాయవాది కేసు వాయిదాలకు హాజరు అవుతూ వచ్చాడు. ఈసారి తప్పనిసరిగా కోర్టు విచారణకు కంగనా సిస్టర్స్ రావాల్సిందే అంటూ కోర్టు ఆదేశించింది. దాంతో ఈ స్టార్ హీరోయిన్ సిస్టర్స్ కోర్ట్‌కి వెళ్లక తప్పేలా లేదు. ఒకవేళ ఈ కేసులో కంగనా సిస్టర్స్ ఓడిపోతే ఆదిత్యకు భారీ మొత్తంలో నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందనే టాక్ ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఇకనైనా ఈ సిస్టర్స్ నోటికి తాళం పడుతుందో లేదో... అదీ చూద్దాం. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments