Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భుత్వం చేయ‌ని ప‌నులు సుకుమార్ చేశాడు హాట్యాఫ్ అంటున్న మాజీ ఎం.పి.

Webdunia
గురువారం, 27 మే 2021 (15:39 IST)
Harshakumar-sukumar
క‌రోనా కాలంలో ప్ర‌భుత్వాలు చేయ‌లేని మంచి ప‌నులు ప‌లువురు ముందుకు వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డంపై స‌ర్వ‌త్రా ప్ర‌జ‌ల్లో వారిపై పాజిటివ్ కోణం వుంది. ఇటీవ‌ల సినీమారంగానికి చెందిన ప‌లువురు త‌మ‌కు చేత‌నైనంత స్థాయిలో వేక్సిన్‌లు, ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లు, నిత్యావ‌స‌ర స‌రుకులు అంద‌జేస్తున్నారు. తాజాగా సుకుమార్ రాజోలు అనే మారుమూల గ్రామంలో క‌రోనా పేషెంట్ల‌కు అందుబాటులో ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని అక్కడ ఏరియా మాజీ ఎం.పి. హ‌ర్ష‌కుమార్‌, సుకుమార్‌కు ఫోన్‌చేసి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. అదే కాకుండా చిన్న వీడియో బైట్‌ను కూడా రిలీజ్ చేశారు.
 
అందులో ఏమి చెప్పారంటే, ఈ పేండ‌మిక్ టైంలో రోగులకు స‌త్వ‌రం ఏమి కావాలో వాటిని సుకుమార్‌గారు స‌ప్ల‌యి చేశారు. 40ల‌క్ష‌లు ప్ర‌క‌టించిన 10 రోజుల్లోనే కార్య‌రూపం దాల్చారు. ఇంత త్వ‌ర‌గా ప‌నులు చేస్తార‌ని అనుకోలేదు. ఆక్సిజ‌న్ వ‌ల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడిన‌వారు ఆయ‌న‌. చాలా క‌ష్ట‌మైన ప‌నిని ప్ర‌భుత్వాలు కూడా చేయ‌లేదు. కానీ సుకుమార్ చేశాడు. ఆయ‌న‌కు ఈ ఊరి ప్ర‌జ‌ల‌పై ప్రేమ అటువంటిది. అంద‌రూ ఇలా వుంటే దేశానికి ఎంతో మేలు చేయ‌వ‌చ్చు. అని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా త‌నకు ఫోన్ చేసి వీడియో కూడా పంపిన హ‌ర్ష‌కుమార్‌ను సుకుమార్ మీ అభిమానానికి ధ‌న్య‌వాదాలు అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments