Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో భూకంపం.. తృటిలో తప్పించుకున్న రాజమౌళి!!!

ఠాగూర్
గురువారం, 21 మార్చి 2024 (12:45 IST)
జపాన్ దేశాన్ని మరోమారు భారీ భూకంపం కుదిపేసింది. గురువారం ఉదయం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో ఈ భూప్రకంపనలు నమోదయ్యాయి. వీటి నుంచి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తృటిలో తప్పించుకున్నారు. ఈ భూకంపం సంభవించినపుడు రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయ, ఇతర కుటుంబ సభ్యులు ఓ భవనంలోని 28వ అంతస్తులో ఉన్నారు. ఈ భూకంపం వల్ల తాము తీవ్ర భయాందోళనకు గురైనట్టు కార్తికేయ ట్వీట్ చేశారు. 
 
ఆర్ఆర్ఆర్ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్‌ కోసం దర్శకుడు రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ, నిర్మాత శోభు యార్లగడ్డలు జపాన్‌లో ఉంటున్నారు. వారు బస చేసిన ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూప్రకంపనల వల్ల తాను భయాందోళనలకు గురయ్యానని కార్తికేయ ట్వీట్‌ చేశారు.
 
భూకంపం అలర్ట్‌కు సంబంధించిన ఫొటో షేర్‌ చేసిన ఆయన.. 'జపాన్‌లో ఇప్పుడే భూకంపం వచ్చింది. నేను 28వ ఫ్లోర్‌లో ఉన్నా. భూమి కంపించడం చూసి కొద్ది క్షణాల్లో భూకంపమని అర్థమైంది. నేను చాలా భయపడ్డా. కానీ, నా చుట్టూ ఉన్న జపాన్‌వాసులు ఎలాంటి కంగారు లేకుండా.. ఏదో వర్షం పడుతున్నట్లు ఏమాత్రం చలించలేదు' అని రాసుకొచ్చారు.  ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు.. 'స్క్రీనింగ్‌ అయిపోయింది కదా. ఇండియా వచ్చేయండి', 'అక్కడ అంతా బాగానే ఉందా' అని కామెంట్స్‌ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments