Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లవారితే గురువారం సినిమా గురించి మీరే చెప్పాలి : రాజమౌళి

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (07:59 IST)
తన అన్న, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా తెరకెక్కిన చిత్రం తెల్లవారితే గురువారం. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్ నగరంలో జరిగింది. ఇందులో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పాల్గొని మాట్లాడుతూ, 'ఈ సినిమా టీజర్‌, పాటలు, ట్రైలర్‌ చాలా బాగున్నాయి. ఇంట్లో వాళ్లు ఏం చేసినా బాగుందనిపిస్తుంది కాబట్టి సినిమా గురించి ప్రేక్షకులే చెప్పాలనుకుంటున్నా. 
 
సినిమా చాలా రిచ్‌గా అనిపిస్తోంది. నిర్మాతలు మంచి ప్రొడక్షన్‌ వాల్యూస్‌తో తీశారు. తొలి సినిమా అయినప్పటికీ దర్శకుడు కాన్ఫిడెంట్‌తో హ్యాండిల్‌ చేశాడు' అని చెప్పుకొచ్చారు. అలాగే, కీరవాణి మాట్లాడుతూ, 'ఈ పనే చేయమని మా పిల్లలకు చెప్పను. వాళ్లకు నచ్చింది చేసే స్వేచ్ఛ ఇచ్చా' అని అన్నారు. 
 
కాగా, ఈ చిత్రానికి మణికాంత్‌ జెల్లీ దర్శకత్వం వహించగా, మిషా నారంగ్‌, చిత్రా శుక్లా హీరోయిన్లుగా నటించారు. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలు. కాలభైరవ సంగీతాన్ని అందించాడు. ఈ నెల 27న విడుదలకానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ నగరంలో జరిగింది. దీనికి టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments