Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నను చూశాను.. అమ్మ ఎలా ఉందంటూ సైగతో అడిగారు.. హ్యాపీగా ఉన్నా : ఎస్పీ చరణ్

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (18:21 IST)
కరోనా వైరస్ బారినపడి జీవనపోరాటం చేస్తున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలుసబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ప్రత్యేక ఐసీయూ వార్డులో ఎక్మో సపోర్టుతో ఉన్నారు. అయితే, ఆయన ఆరోగ్యం విషమంగా మారిన విషయం తెల్సిందే. అయినప్పటికీ ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుండగా, ఆయన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. 
 
ఈ క్రమంలో తన తండ్రి ఆరోగ్యంపై ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ చాలా రోజుల తర్వాత సంతోషం వెలిబుచ్చారు. రెండు వారాల తర్వాత తన తండ్రిని చూశానని హర్షం వ్యక్తం చేశారు. 'నాన్న నన్ను చూసి గుర్తుపట్టారు. కొద్దిగా మాట్లాడారు. ఎలావున్నారు? అని అడిగితే బొటనవేలు పైకెత్తి చూపించారు. అందరూ చేస్తున్న ప్రార్థనల గురించి వివరించాను. 
 
ఆ తర్వాత నేను ఎలా ఉన్నానని అడిగారు. అమ్మ ఎలా ఉందంటూ సైగల ద్వారా అడిగారు. చాలారోజుల తర్వాత నాన్నను చూడడం సంతోషం కలిగిస్తోంది. నన్ను చూసి ఆయన కూడా సంతోషించి ఉంటారని భావిస్తున్నాను. ఇకపై తరచుగా వెళ్లి నాన్నను కలుస్తాను. నాన్న కచ్చితంగా కోలుకుని తిరిగి వస్తారు' అంటూ ఎస్పీ చరణ్ వీడియో సందేశంలో తెలిపారు. తన తండ్రి చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని అయితే రోజులో అధికశాతం మత్తులోనే ఉంటున్నారని వెల్లడించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#SPB health update

A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) on

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments