Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెళ్లిపీటలపై కూర్చోనున్న రజనీ కుమార్తె సౌందర్య

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (09:31 IST)
సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రెండో పెళ్లి చేసుకోనుంది. గతంలో నగరానికి చెందిన యువ పారిశ్రామికవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇపుడు మళ్లీ రెండో పెళ్లి చేసుకోనుంది. కోయంబత్తూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త కుమారుడుతో ఆమె పెళ్లి జరుగనుంది. ఈ వివాహం మాత్రం ఇరు కుటుంబాల మధ్యే నిర్వహించనున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం ముగియగా, పెళ్లి మాత్రం వచ్చే నెలలో జరుగనుంది. 
 
ఇదిలావుంటే, సౌందర్య తన తల్లి లతా రజినీకాంత్‌తో కలిసి మంగళవారం తిరుపతికి వెళ్లి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. వీరివెంట ఇరు కుటుంబాల సభ్యులతో పాటు మొత్తం 20 మంది వరకు వెళ్లారు. 
 
వీరంతా సోమవారం రాత్రికే పద్మావతి అతిథి గృహంలో బస చేసి మంగళవారం వేకువజామున స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు వివాహ పత్రికను వేంకటేశ్వరుని పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిక్కర్ స్కామ్ : వెలుగు చూస్తున్న నోట్ల కట్టల వీడియోలు

ప్రియురాలితో భార్య చేతికి చిక్కిన భర్త ... ఎక్కడ?

బీమా సొమ్ము కోసం కన్నతండ్రినే కారుతో ఢీకొట్టించిన కుమారుడు...

నైట్ రైడర్స్ బార్‌ను ధ్వంసం చేసిన రాజ్ థాక్రే అనుచరులు

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.. ఫోన్ సిగ్నల్ ఆధారంగా యేడాది తర్వాత వెలుగులోకి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments