Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలస కార్మికులకు దేవుడు.. రైళ్లు, బస్సులు కాదు.. ఫ్లైట్ బుక్ చేశాడు..

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (12:56 IST)
కరోనా మహమ్మారి కారణంగా రోడ్డున పడిన వలస కార్మికులను ఆదుకునేందుకు నటుడు సోనూసూద్ ముందుకు వచ్చారు. దీంతో వలస కార్మికులకు ఆయన దేవుడిగా కనిపించారు. ఇప్పటికే బస్సులు, రైళ్ల ద్వారా స్వస్థలాలకు కార్మికులు చేరుకున్నారు. ఇటీవల కొచ్చి నుండి భువనేశ్వర్‌కి ప్రత్యేక ఫ్లైట్ ద్వారా దాదాపు 150 మందిని సొంత గూటికి చేర్చారు. 
 
తాజాగా మరో ఫ్లైట్‌ను సోనూ బుక్ చేశారు. తాజాగా ముంబై నుండి ఉత్తారాఖండ్‌లోని డెహ్రాడూన్‌కి వెళ్ళేందుకు ఎయిర్ ఏషియాకి చెందిన విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లైట్‌లో 173 మంది వలస కార్మికులని వారి ప్రాంతానికి పంపారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టాలలో ఉన్న వారికి అండగా ఉండడం తనకి సంతోషంగా వుందన్నారు. వలస కార్మికులలో చాలా మందికి ఎప్పుడూ విమాన ప్రయాణం చేసే అవకాశం రాలేదని తెలిపారు.
 
వారి కుటుంబాలని, స్నేహితులని కలుసుకునేందుకు ఎయిర్ ఏషియా ఇండియా విమానంలో ప్రయాణించినప్పుడు వారి ముఖాల్లో చిరునవ్వులు చూస్తుంటే ఎంతో ఆనందాన్ని ఇచ్చాయన్నారు. వలస కార్మికుల కోసం భవిష్యత్తులో మరిన్ని విమానాలను ఏర్పాటు చేయనున్నట్లు సోను సూద్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments