Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్సిజన్‌ కొరతకు చెక్.. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు.. సోనూ సూద్

Webdunia
మంగళవారం, 11 మే 2021 (16:31 IST)
కరోనా మొదటి దశలో దేశం మొత్తం లాక్‌డౌన్‌ విధిస్తే.. వలస కార్మికులను ఆదుకున్న రియల్‌ హీరో సోనూసోద్‌. ప్రస్తుతం కోవిడ్‌ రెండో దశలో కూడా.. దేశ ప్రజలకు నేనున్నానంటూ అభయమిస్తున్నారు. ఇప్పుడు ఆక్సిజన్‌ కొరత వల్ల ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. ఈ మరణాలను చూసి చలించిపోయిన సోనూసోద్‌.. ఇకపై ఆక్సిజన్‌ కొరత లేకుండా.. ఏకంగా ఆక్సిజన్‌ ప్లాంట్లనే ఏర్పాటు చేస్తున్నారు. 
 
ముందుగా నాలుగు ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు. వీటికోసం ఫ్రాన్స్‌, ఇతర దేశాల నుంచి విక్రయిస్తున్నారు. అయితే ఈ ప్లాంట్లను ముందుగా కోవిడ్‌ కేసులు అధికంగా ఉన్న ఢిల్లీ, మహారాష్ట్రలతోపాటు, ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు. కాగా తొలి ప్లాంట్‌ ఫ్రాన్స్‌ నుంచి మరో పది రోజుల్లో భారత్‌కు రానుంది.
 
'కేవలం ఆక్సిజన్‌ కొరతతోనే చాలామంది మరణిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఆక్సిజన్‌ సిలిండర్లను ఏర్పాటు చేసినా.. ఈ సమస్య పరిష్కారం ప్లాంట్‌ వల్లనేనని భావిస్తున్నా. ఆక్సిజన్‌ను సమయానికి అందించేలా మా వంతు కృషి మేం చేస్తున్నాం' అని సోనూసూద్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments