Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు భారీగా నిధులు

ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు భారీగా నిధులు
, ఆదివారం, 9 మే 2021 (16:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా రెండో దశ వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు నడుంబిగించింది. రాష్ట్రంలో 49 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. 
 
అందుకోసం రూ.309.87 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు రాబోయే 6 నెలలకు రూ.60 లక్షలు మంజూరు చేయనున్నారు.
 
ఈ క్రమంలో 50  క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను కూడా కొనుగోలు చేయనున్నారు. అంతేగాకుండా, 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. 
 
అటు, ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ బాధ్యతలను ఐఏఎస్ అధికారి కరికాల వలవన్ కు అప్పగించారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సరఫరా తీరుతెన్నులను ఆయన పర్యవేక్షిస్తారు. 
 
అలాగే, ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణ ఇంఛార్జ్‌గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ దిగుమతిని ఆయన పర్యవేక్షిస్తారు. లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరాపై కరికాల వలవన్‌ దృష్టిసారించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్పత్తి కార్యకలాపాలు తిరిగి ప్రారంభించిన అమర రాజ సంస్థ