Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళసూత్రాన్ని చేతికి ధరిస్తానంటున్న బాలీవుడ్ నటి.. ఎవరు?

మంగళసూత్రాన్ని మెడలో వేసుకుంటే భర్త హృదయానికి దగ్గరగా ఉంటారన్నది భారతీయ స్త్రీల నమ్మకం. కానీ, బాలీవుడ్ నటి మాత్రం తద్విరుద్ధంగా నడుచుకుంటోంది. అగ్నిసాక్షి తన మెడలో భర్త కట్టిన తాళిని ఆ బాలీవుడ్ నటి చే

Webdunia
బుధవారం, 30 మే 2018 (10:38 IST)
మంగళసూత్రాన్ని మెడలో వేసుకుంటే భర్త హృదయానికి దగ్గరగా ఉంటారన్నది భారతీయ స్త్రీల నమ్మకం. కానీ, బాలీవుడ్ నటి మాత్రం తద్విరుద్ధంగా నడుచుకుంటోంది. అగ్నిసాక్షి తన మెడలో భర్త కట్టిన తాళిని ఆ బాలీవుడ్ నటి చేతికి కట్టుకుని తిరుగుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటివారివల్లే భారతీయ సంప్రదాయం నాశనమైపోతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇంతకీ ఆ బాలీవుడ్ నటి ఎవరన్నదే కదా మీ సందేహం... ఆమె ఎవరో కాదు.. సోనమ్ కపూర్. ఈమె వివాహం ఇటీవలే ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్‌ అహూజాతో అత్యంత వైభవంగా జరిగింది. పంజాబీ స్టైల్‌లో జ‌రిగిన వీరి వివాహ వేడుక‌కి బాలీవుడ్ తారాగ‌ణం మొత్తం త‌రలి వ‌చ్చింది. సోన‌మ్ న‌టించిన "వీరే ది వెడ్డింగ్" చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుండ‌గా ప్ర‌స్తుతం ప్రమోష‌న్స్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంది. 
 
అయితే ప్ర‌మోష‌న్ కార్య‌క్రమాల‌లో డిఫ‌రెంట్ డ్రెస్సింగ్స్‌లో క‌నిపిస్తున్న సోన‌మ్ ఎక్క‌డికి వెళ్లిన మంగ‌ళ సూత్రాన్ని చేతికి క‌ట్టుకొని వెళుతుంద‌ట‌. దీంతో నెటిజ‌న్స్ మండిప‌డుతూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు కామెంట్స్ పెడుతున్నారు. 
 
సోన‌మ్ భార‌తీయ సంప్ర‌దాయాన్ని మంట గ‌లుపుతుంద‌ని కొంద‌రు నెటిజ‌న్స్ ఆమెపై మండిప‌డుతున్నారు. పెళ్లైన ప్ర‌తీ మ‌హిళ మంగ‌ళ‌సూత్రం వేసుకోవాల‌నే నిమ‌యం లేక‌పోయిన‌, మ‌నం పెట్టుకున్న కొన్ని క‌ట్టుబాట్లు ఆచార వ్య‌వ‌హారాలు పాటించాల్సిందేనంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
 
బాలీవుడ్‌ సెలబ్రిటీలు విదేశీ సంప్రదాయానికి అలవాటు పడి మన సంప్రదాయాన్ని అవమానపరుస్తున్నారు. భారతీయ సంప్రదాయాన్ని విదేశీ సంప్రదాయంలో కలిపేస్తున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, గతంలో కూడా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కూడా త‌న చేతికి మంగ‌ళ‌సూత్రం ధ‌రించి విమ‌ర్శ‌ల పాల‌ైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments