స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదు

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (14:54 IST)
పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారిన అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. తాజాగా ఆయన నటించిన ఓ యాడ్ వివాదాస్పదం కావడంతో ఈ కేసు నమోదైంది. గతంలో రాపిడో సంస్థ బన్నీతో చేయించిన ప్రకటన చేయించింది. ఇది కూడా వివాదమైంది. 
 
సిటీ బస్సుల గురించి యాడ్‌లో చూపించడంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అప్పట్లో ఫైర్ అయ్యారు. ఆ యాడ్ తొలగించకపోతే అల్లు అర్జున్, రాపిడో సంస్థపై కేసు వేస్తామని హెచ్చరించారు. దెబ్బకు దిగి వచ్చిన రాపిడో యాజమాన్యం అందులో సిటీ బస్సుల గురించి తీసిన షాట్ తొలగించింది.
 
ఆ తర్వాత బన్నీ యాక్ట్ చేసిన జొమాటో యాడ్ కూడా వివాదానికి దారి తీసింది. ఈ యాడ్‌లో నటుడు సుబ్బరాజును బన్నీ కొట్టగా.. ఆ దెబ్బకు సుబ్బరాజు గాల్లో తేలిపోతాడు. ఇదికూడా వివాదాస్పదమైంది. 
 
ఇపుడు శ్రీ చైతన్య విద్యాసంస్థల కోసం ఓ యాడ్ చేశాడు. ఆ ప్రకటనపై ప్రస్తుతం వివాదం నెలకొంది. కొత్త ఉపేందర్‌ రెడ్డి అనే సామాజిక కార్యకర్త అల్లు అర్జున్‌పై హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
బన్నీ నటించిన శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యాపార ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని అన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకుల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆయన బన్నీతో పాటు శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కేసు పెట్టారు. తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments