Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదు

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (14:54 IST)
పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారిన అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. తాజాగా ఆయన నటించిన ఓ యాడ్ వివాదాస్పదం కావడంతో ఈ కేసు నమోదైంది. గతంలో రాపిడో సంస్థ బన్నీతో చేయించిన ప్రకటన చేయించింది. ఇది కూడా వివాదమైంది. 
 
సిటీ బస్సుల గురించి యాడ్‌లో చూపించడంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అప్పట్లో ఫైర్ అయ్యారు. ఆ యాడ్ తొలగించకపోతే అల్లు అర్జున్, రాపిడో సంస్థపై కేసు వేస్తామని హెచ్చరించారు. దెబ్బకు దిగి వచ్చిన రాపిడో యాజమాన్యం అందులో సిటీ బస్సుల గురించి తీసిన షాట్ తొలగించింది.
 
ఆ తర్వాత బన్నీ యాక్ట్ చేసిన జొమాటో యాడ్ కూడా వివాదానికి దారి తీసింది. ఈ యాడ్‌లో నటుడు సుబ్బరాజును బన్నీ కొట్టగా.. ఆ దెబ్బకు సుబ్బరాజు గాల్లో తేలిపోతాడు. ఇదికూడా వివాదాస్పదమైంది. 
 
ఇపుడు శ్రీ చైతన్య విద్యాసంస్థల కోసం ఓ యాడ్ చేశాడు. ఆ ప్రకటనపై ప్రస్తుతం వివాదం నెలకొంది. కొత్త ఉపేందర్‌ రెడ్డి అనే సామాజిక కార్యకర్త అల్లు అర్జున్‌పై హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
బన్నీ నటించిన శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యాపార ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని అన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకుల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆయన బన్నీతో పాటు శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కేసు పెట్టారు. తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

మహారాష్ట్ర రాజకీయాలు - మహాయుతి కూటమిలో లుకలుకలు

మూత్రంతో కళ్లను సొంతం చేసుకున్న మహిళ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments