Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎ.ఎమ్. రాజా జయంతి.. తెలుగులో తొలి కవ్వాలిని పాడిన ఘనుడు

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (12:34 IST)
AM Raja
తొలి దక్షిణాది చలనచిత్ర గాయకుడు ఎ.ఎమ్. రాజా. తెలుగు సినిమాలో తొలి కవ్వాలిని ఎ.ఎమ్. రాజా పాడారు. 1952లో పెంపుడు కొడుకు సినిమా ఎస్. రాజేశ్వరరావు సంగీతంలో ఆ కవ్వాలి నమోదయింది. ఎ.ఎమ్.రాజా మంచి‌ సంగీతదర్శకులు కూడా.‌ 
 
పాశ్చాత్య సంగీతం ప్రభావంతో ఆయన చాల మంచి పాటలు చేశారు.‌ శోకగీతాల్ని కూడా పాశ్చాత్య సంగీతం ధోరణిలో గొప్పగా చేశారు. తమిళంలో గొప్ప పాటల్ని చేశారు.
 
దక్షిణ భారతదేశంలో నక్షత్రస్థాయిని అందుకున్న తొలి చలనచిత్రనేపథ్య గాయకుడు ఘంటసాల. ఆ ఘంటసాల ప్రభావం ఎంతమాత్రమూ లేకుండా ఒక గాయకుడుగా రాజా చలామణిలోకి వచ్చారు. 
 
రాజా మధురగాత్రంలో జాలువారిన ఎన్నో గీతాలు ఈ నాటికీ వీనులవిందు చేస్తూనే ఉన్నాయి. రాజా పాడిన పాటలకు నవీనబాణీల గుబాళింపుతోనూ కొందరు పరవశించే ప్రయత్నం చేశారు.
 
రాజా వాణి, ఆయన బాణీ, ఆయన గళం అన్నీ జనాన్ని మధురలోకాల్లో విహరింపచేశాయి. తన జీవితభాగస్వామి గాయని జిక్కితో కలసి రాజా పాడిన పాటలు సైతం తెలుగునేలపై చిందులు వేయించాయి. ఆయన మన తెలుగువాడు కావడం మన అదృష్టంగా భావించి సంతోషిద్దాం.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments