Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తమ్ముడు' సినిమాతో దూరం.. 'అన్నయ్య' సినిమాతో రీఎంట్రీ

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (16:06 IST)
2017లో వచ్చిన 'కాటమరాయుడు' సినిమా తర్వాత మళ్లీ తెలుగుతెరకు దూరమైన శృతిహాసన్ ఇప్పుడు 'అన్నయ్య' సినిమాతో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయనే ఊహాగానాలు వినపడుతున్నాయి. మరి అన్నీ అనుకున్నట్లు జరిగినట్లయితే చిరంజీవి-కొరటాల సినిమాలో శృతిహాసన్‌ను హీరోయిన్‌గా తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. 
 
నిజానికి 'కాటమరాయుడు' ఫ్లాప్‌కి, శృతిహాసన్ గ్యాప్‌కి ఎటువంటి సంబంధం లేదు. ఆవిడ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ చేయడంతోపాటు, ప్రియుడు మైఖేల్ కోర్సల్‌తోనూ, కుటుంబంతోనూ సమయం గడపాలనే ఉద్దేశ్యంతో ఆవిడ ఉద్దేశ్యపూర్వకంగా ఈ గ్యాప్ తీసుకోవడం జరిగింది.
 
ఆ విధంగా రెండేళ్లుగా వెండితెరకు దూరమైన శృతిహాసన్, తాజాగా మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ హిందీ సినిమాకు ఓకే చెప్పి తాజాగా తెలుగు, తమిళ భాషలపై కూడా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే చిరంజీవి సినిమా ఆఫర్ కూడా శృతిహాసన్ చెంతకు వచ్చినట్టు తెలుస్తోంది. 
 
గతంలో శృతిహాసన్‌తో 'శ్రీమంతుడు' సినిమా చేసిన దర్శకుడు కొరటాల శివ... చిరంజీవి సరసన కూడా ఆమె అయితే బాగుంటుందని భావించి సంప్రదించాడట. ప్రస్తుతానికైతే కథా చర్చలు ముగిసాయి కానీ శృతిహాసన్ ఇంకా తన నిర్ణయం చెప్పలేదని అంటున్నారు.
 
మరి ఆవిడగారి నిర్ణయమేమిటో ఇంకా వెల్లడి కావలసి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments