Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృతి హాసన్‌ను కలిసిన ఆ ఇద్దరు..?

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (11:46 IST)
ఈ మధ్యకాలంలో శృతిహాసన్ బ్రేకప్ సంచలనంగా మారిన తర్వాత మళ్లీ సినీ పరిశ్రమలో తన సత్తా చాటడానికి రెడీ అవుతోంది. చివరిగా పవన్ కల్యాణ్‌తో కాటమరాయుడు సినిమాతో సినీ పరిశ్రమకు దూరమైన ఆమె ఇప్పుడు మళ్లీ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు. 
 
బ్రిటన్‌లోని రాక్ బ్యాండ్ సభ్యుడు మైఖేల్ కోర్సలేతో కొద్దికాలం ప్రేమలో మునిగిన తర్వాత దాదాపు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ అనుకోకుండా వారిద్దరికీ బ్రేకప్ కావడంతో ఇప్పుడు శృతి అటు మ్యూజిక్, ఇటు సినిమాపై దృష్టి పెట్టింది.
 
హాలీవుడ్‌లో శృ‌తి హాసన్ ఓ అమెరికన్ సిరీస్‌కు ఒకే చెప్పి, ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకొంది. త్వరలోనే ట్రెడ్‌స్టోన్ అనే సిరీస్‌లో నటించనున్న శృతి దక్షిణాదిలో పలు ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలలో కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ముంబైలో శృతితో కలిసి రానా దగ్గుబాటి, రాఘవేంద్రరావు తనయుడు, దర్శకుడు ప్రకాశ్ కొవెలమూడి కలిసి హంగామా చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
ముంబైలో ఉంటున్న శృతిహాసన్‌ను రానా, ప్రకాశ్ కోవెలమూడి వెళ్లి, కలిశారు. వారంతా ఏదో ఓ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిపారు, కానీ ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. త్వరలోనే రానా, శృతితో ప్రకాశ్ సినిమా చేసే అవకాశం లేకపోలేదని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వీరందరూ కలిసి చేసిన హంగామాలో జోష్ ఏ మాత్రం తగ్గనట్లుగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments